టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మైనార్టీల అభివృద్ధి….
– ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు:
కరోనా కష్ట కాలంలోనూ రంజాన్ పర్వదినం పురస్కరించుకొని అర్హులైన ప్రతి ముస్లిం కుటుంబానికి రంజాన్ తోఫా అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు పట్టణంలోని పెద్ద మసీదు ప్రాంగణం లో నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలసి ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు వారి వారి ప్రధాన పండుగలను సంతోషంగా నిర్వహించుకోవాలన్న సమున్నత లక్ష్యం తో బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాలను ప్రారంభించినట్లు తెలిపారు. కరోనా మూలంగా తీవ్ర ఇబ్బందులు ఉన్నప్పటికిని సంక్షేమ పథకాల అమలులో వెనుకడుగు వేయడం లేదన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల గిఫ్ట్ ప్యాక్ లను ప్రభుత్వం పంపిణీ చేసేందుకు నిర్ణయించిందని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి మసీదు కమిటీ ఆధ్వర్యంలో వారి వారి పరిధిలోని అర్హులైన నిరుపేద ముస్లిం కుటుంబాలకు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…