Districts

అవినీతి అదుపుతోనే అభివృద్ధి సాధ్యం…

 గీతం విద్యార్థులతో ముఖాముఖిలో కేరళ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్ రాజు వ్యాఖ్య

మనవార్తలు , పటాన్ చెరు:

దురదృష్టవశాత్తు అవినీతి దేశ నెతికతనే దెబ్బతీస్తోందని , అవసరం ఆధారిత , దురాశతో కూడిన అవినీతి క్రమంగా పెచ్చరిల్లుతోందని , దానిని అదుపు చేయగలిగినప్పుడే మనదేశం ఫలవంతమైన గమ్యాన్ని చేరుకోగలదని కేరళ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి , 1991 ఐఏఎస్ బ్యాచ్ టాపర్ , ఐఐటీ మద్రాసు పూర్వ విద్యార్థి డాక్టర్ రాజు నారాయణ స్వామి అన్నారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని సీఎస్ఈ విద్యార్థులతో మంగళవారం నిర్వహించిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు . గీతం విద్యార్థి విభాగాలు దిశ , సీఎస్ఐలు నిర్వహించిన ఈ కార్యక్రమంలో , ‘ కంప్యూటర్ సెన్స్డ్ కొత్త సరిహద్దులు విహంగ వీక్షణం ‘ అనే అంశంపై ఆయన తొలుత ప్రసంగించారు . ఆ తరువాత విద్యార్థులు సంధించిన పలు ప్రశ్నలకు జవాబులిచ్చారు .

విద్య అక్షరాభ్యాసంతో ప్రారంభం కాదని , తల్లి చూపుతో , తండ్రి పరిశీలనతో మొదలవుతుందని , అక్షరాస్యత విద్య యొక్క ముగింపో , ప్రారంభమో కాదని , విద్య మానవతావాదం కోసం , సహనం కోసం , ఆలోచనల సాహసం కోసం , సత్యాన్వేషణ కోసం జరగాలని , అంతిమంగా విద్య ఒకరిని మంచి మనిషిగా తీర్చిదిద్దాలని ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు . నిరంతర పరిశోధనలతో కంప్యూటర్ సామర్థ్యాన్ని అపరిమితంగా పెంచుతున్నారని , ఫజ్జీ లాజిక్ ద్వారా ఒకనాటికి అందాల పోటీలలో కంప్యూటరే న్యాయనిర్ణేత కాలగదని డాక్టర్ రాజు జోస్యం చెప్పారు . అంతరిక్ష పరిశోధనా సంస్థ విజన్ -2075 ని ఉటంకిస్తూ , ఆకాశంలో రెండు లక్షల కిలోమీటర్ల ఎత్తున అంతరిక్ష కాలనీలు వస్తాయని , జియో శాటిలెన్డ్ స్టేషన్కు లిఫ్ట్లో , అక్కడి నుంచి రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళేలా పరిశోధనలు సాగుతున్నట్టు చెప్పారు .

 

పనిని అంకితభావంతో చేస్తేనే అది విజయవంతమవుతుందని , శ్వేదం చిందించకుండా విలువెనైవేదీ మనకు దక్కదని , విజయ స్ఫూర్తితో ముందుకు సాగాలని , ఘనమైన నాగరికతకు వారసులమని గుర్తించాలని , అప్పుడు మనల్ని ఏ శక్తీ అడ్డుకోలేదని విద్యార్థుల హర్షధ్వానాల మధ్య సర్ సీ.వీ.రామన్ను ఉటంకిస్తూ డాక్టర్ నారాయణస్వామి చెప్పారు . తొలుత , గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య అతిథిని స్వాగతించి , సత్కరించారు . ఈ ముఖాముఖిలో సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.ఫణికుమార్ , ప్రొఫెసర్ పి.ఈశ్వరయ్య , డాక్టర్ జోసెఫ్ జయకర్ , డాక్టర్ పి.నరసింహస్వామి , సీఎస్ఐ సమన్వయకర్త ఎం.కిరణ్ శాస్త్రితో పాటు పలువురు గీతం విద్యార్థులు పాల్గొన్నారు .

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago