Districts

అవినీతి అదుపుతోనే అభివృద్ధి సాధ్యం…

 గీతం విద్యార్థులతో ముఖాముఖిలో కేరళ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్ రాజు వ్యాఖ్య

మనవార్తలు , పటాన్ చెరు:

దురదృష్టవశాత్తు అవినీతి దేశ నెతికతనే దెబ్బతీస్తోందని , అవసరం ఆధారిత , దురాశతో కూడిన అవినీతి క్రమంగా పెచ్చరిల్లుతోందని , దానిని అదుపు చేయగలిగినప్పుడే మనదేశం ఫలవంతమైన గమ్యాన్ని చేరుకోగలదని కేరళ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి , 1991 ఐఏఎస్ బ్యాచ్ టాపర్ , ఐఐటీ మద్రాసు పూర్వ విద్యార్థి డాక్టర్ రాజు నారాయణ స్వామి అన్నారు . గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని సీఎస్ఈ విద్యార్థులతో మంగళవారం నిర్వహించిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు . గీతం విద్యార్థి విభాగాలు దిశ , సీఎస్ఐలు నిర్వహించిన ఈ కార్యక్రమంలో , ‘ కంప్యూటర్ సెన్స్డ్ కొత్త సరిహద్దులు విహంగ వీక్షణం ‘ అనే అంశంపై ఆయన తొలుత ప్రసంగించారు . ఆ తరువాత విద్యార్థులు సంధించిన పలు ప్రశ్నలకు జవాబులిచ్చారు .

విద్య అక్షరాభ్యాసంతో ప్రారంభం కాదని , తల్లి చూపుతో , తండ్రి పరిశీలనతో మొదలవుతుందని , అక్షరాస్యత విద్య యొక్క ముగింపో , ప్రారంభమో కాదని , విద్య మానవతావాదం కోసం , సహనం కోసం , ఆలోచనల సాహసం కోసం , సత్యాన్వేషణ కోసం జరగాలని , అంతిమంగా విద్య ఒకరిని మంచి మనిషిగా తీర్చిదిద్దాలని ఆయన ఓ ప్రశ్నకు బదులిచ్చారు . నిరంతర పరిశోధనలతో కంప్యూటర్ సామర్థ్యాన్ని అపరిమితంగా పెంచుతున్నారని , ఫజ్జీ లాజిక్ ద్వారా ఒకనాటికి అందాల పోటీలలో కంప్యూటరే న్యాయనిర్ణేత కాలగదని డాక్టర్ రాజు జోస్యం చెప్పారు . అంతరిక్ష పరిశోధనా సంస్థ విజన్ -2075 ని ఉటంకిస్తూ , ఆకాశంలో రెండు లక్షల కిలోమీటర్ల ఎత్తున అంతరిక్ష కాలనీలు వస్తాయని , జియో శాటిలెన్డ్ స్టేషన్కు లిఫ్ట్లో , అక్కడి నుంచి రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళేలా పరిశోధనలు సాగుతున్నట్టు చెప్పారు .

 

పనిని అంకితభావంతో చేస్తేనే అది విజయవంతమవుతుందని , శ్వేదం చిందించకుండా విలువెనైవేదీ మనకు దక్కదని , విజయ స్ఫూర్తితో ముందుకు సాగాలని , ఘనమైన నాగరికతకు వారసులమని గుర్తించాలని , అప్పుడు మనల్ని ఏ శక్తీ అడ్డుకోలేదని విద్యార్థుల హర్షధ్వానాల మధ్య సర్ సీ.వీ.రామన్ను ఉటంకిస్తూ డాక్టర్ నారాయణస్వామి చెప్పారు . తొలుత , గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డెరైక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య అతిథిని స్వాగతించి , సత్కరించారు . ఈ ముఖాముఖిలో సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.ఫణికుమార్ , ప్రొఫెసర్ పి.ఈశ్వరయ్య , డాక్టర్ జోసెఫ్ జయకర్ , డాక్టర్ పి.నరసింహస్వామి , సీఎస్ఐ సమన్వయకర్త ఎం.కిరణ్ శాస్త్రితో పాటు పలువురు గీతం విద్యార్థులు పాల్గొన్నారు .

Ramesh

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

8 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago