Telangana

క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరులో ఘనంగా ప్రారంభమైన 36వ మైత్రి క్రికెట్ కప్ పోటీలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

నేటి తరం యువత క్రీడల పై ఆసక్తి పెంపొందించుకోవాలని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. క్రికెట్ అభివృద్ధికి మైత్రి క్రికెట్ క్లబ్ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో మైత్రి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 36వ మైత్రి క్రికెట్ ట్రోఫీని సోమవారం ఉదయం లాంచనంగా ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర కలిగిన మైత్రి మైదానాన్ని క్రీడారంగానికి కేంద్రంగా తీర్చిదిద్దామని తెలిపారు. మూడు సంవత్సరాల క్రితం 7 కోట్ల 50 లక్షల రూపాయలతో ఆధునిక వసతులతో మైదానాన్ని తీర్చిదిద్దామని తెలిపారు. గత 36 సంవత్సరాలుగా ప్రతి ఏటా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న ఘనత మైత్రి క్రికెట్ క్లబ్ కి దక్కిందని తెలిపారు. నియోజకవర్గంలో క్రీడల పైన ఆసక్తి పెంపొందించడమే లక్ష్యంగా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్న క్రీడాకారులకు. అండగా ఉంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, పారిశ్రామికవేత్తలు కే. సత్యనారాయణరెడ్డి, సి. సత్యనారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ సపాన దేవ్, సిఐ వినాయక్ రెడ్డి, మైత్రి క్రికెట్ క్లబ్ అధ్యక్షులు హనుమంత రెడ్డి, కబడ్డీ జాతీయ క్రీడాకారుడు శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, నర్రా బిక్షపతి, ఇక్బాల్, శ్రీధర్ చారి, పృథ్వీరాజ్, వెంకటేష్, ఎల్లయ్య, గిరి, సంజీవ రెడ్డి, మైత్రి క్రికెట్ క్లబ్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ఐనోల్ మల్లన్న స్వామి జాతర లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గం, ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని ఐనోలు గ్రామంలో సోమవారం శ్రీశ్రీశ్రీ మల్లికార్జున స్వామి…

3 hours ago

కాంగ్రేస్ నయవంచన పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ జెడ్పీటీసీ…

4 hours ago

దేశ సాంకేతిక, ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తున్న డ్రోన్లు

ఐదు రోజుల బూట్ క్యాంప్ ప్రారంభోత్సవంలో సీ-డాక్ హైదరాబాద్ నిపుణుడు ప్రణయ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మన దేశ…

5 hours ago

ఆర్కిటెక్చర్ కోర్సు, కెరీర్ అవకాశాలపై అవగాహన

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆర్కిటెక్చర్ విద్య, కెరీర్ అవకాశాల గురించి ఇంటర్మీడియెట్ విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించే లక్ష్యంతో,…

2 days ago

గణితంలో ఆదుర్తి శ్రీవల్లికి పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని…

3 days ago

ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా రంగోలి, కైట్ ఫెస్టివల్

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

5 days ago