Telangana

బీసీలకు రాజ్యాధికారం కావాలని డిమాండ్ :ఎన్ఎమ్ఆర్ యువసేన సభ్యులు

_నీలం కు స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ 

_భారీగా తరలివచ్చిన అభిమానులు, సబ్బండ వర్గాలు

నర్సాపూర్ ,మనవార్తలు ప్రతినిధి :

పటాన్ చెరు ఎమ్మెల్యేగా బరిలో ఉండాలని నినాదాలు చేశారు. స్వచ్చందంగా ఎన్నికల ప్రచారానికి వచ్చి, ఇంటింటికి ప్రచారం నిర్వహించి మిమ్మల్ని గెలిపించుకుంటామని ధైర్యం ఇచ్చారు. అనంతరం ర్యాలీ నిర్వహిస్తూ జై మదన్న నినాదాలతో హోరెత్తిస్తూ అపూర్వ స్వాగతం పలికారు.నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలం సదాశివపల్లి గ్రామంలో జరిగిన ఆంజనేయస్వామి ఆలయ ధ్వజ స్తంభ ప్రతిష్టతో నవగ్రహాల విగ్రహ ప్రతిష్టపాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నీలం మధు కు ఆయన అభిమానులు, మద్దతు దారులు దారి పొడవునా స్వాగతం పలికారు. కౌడిపల్లి మండల కేంద్రంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలి వచ్చిన వివిధ బీసీ సంఘాల నాయకులు, ముదిరాజ్ సామాజిక వర్గ నేతలు ఆయనకు మద్ధతుగా తరలి వచ్చారు. బీసీలకు రాజ్యాధికారం కావాలని డిమాండ్ చేశారు. ఆ దిశగా అడుగులు వేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్న నీలం మధు ముదిరాజ్ ను అభినందించారు.సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్న మీ వెంట తామంతా ఉన్నామని భరోసా ఇచ్చారు. అనంతరం సదాశివపల్లి లో శాస్త్రోక్తంగా నిర్వహించిన ధ్వజ స్తంభ, నవగ్రహల ప్రతిష్టపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ దేవాలయాల నిర్మాణంతో గ్రామాలలో ఆధ్యాత్మిక వాతావరణం అలవాడుతుందన్నారు. నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడి నుంచి బయటపడడానికి, మానసిక ప్రశాంతతకు ప్రతి ఒక్కరు దైవ చింతన అలవర్చుకోవాలని సూచించారు. తనను అభిమానిస్తూ ఘన స్వాగతం పలికిన అభిమానులు, మద్దతుదారులు,  ప్రజల ప్రేమాభిమానాలు మర్చిపోలేనన్నారు. పటాన్ చెరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉండాలని అందరూ కోరుతున్నారని, తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారని ఈ విషయంపై త్వరలో సానుకూల నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు. మీ ప్రేమాభిమానాలు స్ఫూర్తిగా భవిష్యత్తులో మరిన్ని ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనునిత్యం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి మటురి శాఖయ్య, పాండు , స్థానిక సర్పంచ్ నర్సింగరావు, మాజీ జెడ్పీటీసీ జగదీశ్వర్,మాజీ సర్పంచ్ వీరయ్య,దేవరాజు,దుర్గయ్య, గ్రామ పెద్దలు, ప్రజలు, ఎన్ఎమ్ఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

1 hour ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago