politics

దళితుల ఆర్థిక అభ్యున్నతికే దళిత బంధు_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్చెరు నియోజకవర్గం నుండి వంద మంది లబ్ధిదారుల ఎంపిక

పటాన్ చెరు

బంగారు తెలంగాణలో దళితులందరూ ఆర్థిక అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు కార్యక్రమాన్ని ప్రారంభించారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు మండలం పెదకంజర్ల గ్రామంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో పటాన్చెరు నియోజకవర్గ స్థాయి దళిత బంధు పథకం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలకు అనుగుణంగా నియోజకవర్గంలోని 100 కుటుంబాలను ఎంపిక చేసి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల యూనిట్లను అందజేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

పటాన్చెరు నియోజకవర్గంలో పటాన్చెరు మండలం బచ్చుగూడెం, జిన్నారం మండలం కొడకంచి, గుమ్మడిదల మండలం అనంతారం గ్రామాల నుండి 100 దళిత కుటుంబాలను పారదర్శకంగా ఎంపిక చేసినట్లు తెలిపారు. దళిత బంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులు అందరూ ప్రతి పైసాను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోరారు. పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు 27 శాఖల అధికారులు ఆయా అంశాలపై వివరంగా అవగాహన కల్పిస్తారని తెలిపారు. వారు సూచించిన అంశాల ఆధారంగా నచ్చిన వ్యాపారాన్ని ప్రారంభించాలని కోరారు. పథకం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ మానస పుత్రిక దళిత బంధు విజయానికి ప్రతి ఒక్కరు సంపూర్ణంగా సహకరించాలని కోరారు. తాను 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, కలలో కూడా ఇలాంటి పథకం వస్తుందని ఊహించలేదని ఎమ్మెల్యే జిఎంఆర్ అన్నారు. కష్టపడి పనిచేసి సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. అవసరమైన పక్షంలో మరో మారు అవగాహన సదస్సు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి దళిత బంధు పథకం ఆవశ్యకతను లబ్ధిదారులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, నియోజకవర్గ దళిత బంధు ప్రత్యేక అధికారి ప్రసాద్, ఎంపీపీలు సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జెడ్పిటిసి కుమార్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, ఎంపీడీవోలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

2 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

2 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago