Telangana

పోటీ నుంచి సృజనాత్మకత వస్తుంది : నజియా అక్తర్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

సృజనాత్మకత లేదా ఏదైనా ఒక కళారూపం పోటీ నుంచి వస్తుందని, అది ఏ సందర్భంలో, ఎక్కడ, ఎవరు, ఎలా రాశారు అనే దాని గురించి ప్రత్యేకంగా చెబుతుందని ‘బీబీల గది’ (బీబీస్ రూమ్) రచయిత్రి నజియా అక్తర్ అన్నారు. హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించి ‘నారీ కి కలమ్ సే’ (మహిళా రచయితల సంబరాలు)లో ఆమె అతిథిగా పాల్గొన్నారు.గీతం స్టూడెంట్ లెఫ్ సౌజన్యంతో మహిళా లీడర్స్ ఫోరం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ‘బీబీస్ రూమ్’ పుస్తక రచనానుభవాలను ఆమె విద్యార్థులతో పంచుకున్నారు. తాను హైదరాబాద్ సంస్థాన అధికార మార్పిడిపై లోతైన పరిశీలన చేపట్టానని, ఆ క్రమంలోనే అప్పట్లో మహిళా రచయితలు, వారి రచనల గురించి తెలిసినట్లు నజియా చెప్పారు. విభజన సమయంలోని మహిళా సాహిత్యం తనకు పెద్దగా లభించలేదని, అయితే కొందరు వారి ఇళ్లలో ఉన్న రచనలను తనతో పంచుకోవడం ప్రారంభించారని, అలా అధికార మార్పిడి సమయంలో మహిళల జీవనం ఎలా ఉండేది, వారి సృజనాత్మక రచనల గురించి తెలిసిందన్నారు.

అలా ఆయా కుటుంబాల్లోని తల్లులు, సోదరీసుణులు, అమ్మమ్మలు ఉర్దూ భాషలో, గద్య రూపంలో రాసిన 150 పుస్తకాలను తాను అధ్యయనం చేసినట్టు అకర్  హెదరాబాద్ సంస్థానం రాచరిక వ్యవస్థ కావడం వల్ల హెదరాబాద్ ఉర్దూరచయిత్రుల సాహిత్యం ఉందని చాలామందికి తెలియదని నజియా చెప్పారు

. కొన్ని కారణాల వల్ల సాహిత్య చరిత్రలో కూడా ఉర్దూ మహిళా రచయితల ప్రస్తావన కొంత తక్కువగానే ఉందన్నారు. అయితే తాను ఆనాటి గద్య రచనలను చదివాక, స్త్రీ విద్య, పర్దా వంటి వాటిసె చురుకెన సామాజిక సంస్కణ ఉద్యమాలు ఆనాటి సమాజంలో ఉన్నట్టు కనుగొన్నానని ఆమె చెప్పారు. తన పుస్తకంలో జీనత్ సాజిదా, నజ్మా నిఖత్, జిలానీ బానో అనే ముగ్గురు రచయితలపై ప్రధానంగా దృష్టి, సారించినట్టు నజియా అక్తర్ వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె జవాబులిచ్చారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

5 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago