Telangana

డ్రగ్స్ రహిత సమాజం నిర్మిద్దాం పటాన్ చెరు డీఎస్పీ రవీందర్ రెడ్డి

-డ్రగ్స్ అమ్మేవారు, కొనే వారిపైన కఠిన చర్యలు

– డ్రగ్సును అరికట్టే బాధ్యత అందరిదీ

మంజీరా విజ్ఞాన కేంద్రం ఫౌండర్ కే రాజయ్య, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఎందరి జీవితాలను చిన్న భిన్నం చేస్తున్న అరికట్టి డ్రగ్స్ రహిత సమాజంను నిర్మిద్దామని పటాన్ చెరు డిఎస్పీ రవీందర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పటాన్ చెరు పట్టణంలోని డాక్టర్ అబ్దుల్ కలాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎం వి కే( మంజీరా విద్యాలకేంద్రం) ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన డ్రగ్స్ వ్యతిరేక సదస్సు లో పటాన్ చెరు డిఎస్పి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఎవ్వరు కూడా డ్రగ్స్ కు అలవాటు పడకూడదని, అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోకూడదని, సంఘవిద్రోహ శక్తులుగా మారకూడదని హితువు పలికారు, డ్రగ్స్ సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు అందజేయాలని ఆయన కోరారు. డ్రగ్స్ కొన్న అమ్మిన చట్ట రిత్యా నేరమని ఉక్కు పాదం మోపుతామని ఆయన హెచ్చరించారు. మీ భావి భారత జీవితాలను నాశనం చేసుకోకూడదని విజ్ఞప్తి చేశారు, ఒక్కసారి డ్రగ్స్ కు అలవాటు పడితే జీవితం నాశనమైదాకా వదలదని అన్నారు, మీ జీవితాలు, తల్లిదండ్రుల జీవితాలు అందరి జీవితాలు చిన్న భిన్నం అవుతాయనేది గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం కూడా డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాటానికి ఎంతో కృషి చేస్తున్నట్లు, అందులో మీరు మీతో పాటు ప్రతి ఒక్కరూ డ్రగ్స్ రహిత సమాజం కోసం భాగస్వాములు అయి డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ సదస్సులో ఏం వి కే ఫౌండర్ సభ్యులు కే రాజయ్య, కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఎం వి కే కన్వీనర్ అర్జున్ తదితరులు మాట్లాడుతూ డ్రగ్స్ ను అరికట్టాల్సిన బాధ్యత అందరి పైన ఉందని వారు అన్నారు, ఫ్రెండ్ షిప్ చాలా ముఖ్యమైందని, మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నమో చాలా జాగ్రత్తగా చేయాలన్నారు, చెడువారితో అసలు స్నేహం చేయకూడదని, డ్రగ్సును అరకట్టే బాధ్యత తల్లిదండ్రులు, ప్రభుత్వం, పోలీసులు, సామాజిక సంస్థల పైన ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సై అంబార్య నాయక్, ఏం వి కే సభ్యులు బాసిత్, సుదర్శన్ రెడ్డి, ఇమ్మానియేల్ బాబు సురేష్, కాలేజీ లెక్చలర్లు ,ర్యాగింగ్ వ్యతిరేక కన్వీనర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

1 hour ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago