ఢిల్లీ లో జరుగుతున్న ఆందోళనకు ప్రజా మద్దతు
మనవార్తలు – పటాన్ చెరు
కేంద్ర ప్రభుత్వం రైతు,కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న దని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు ఆరోపించారు. పట్టణంలోని శ్రామిక్ భవన్ లో బుధవారం జరిగిన సీపీఎం పటాన్ చెరు ఏరియా కమిటీ ప్రథమ మహా సభలో చుక్కా రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న దని అన్నారు.గత 11నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్న వారి సమస్యలు పట్టించు కోవడం లేదన్నారు. ఢిల్లీ లో జరుగుతున్న ఆందోళనకు ప్రజా మద్దతు ఉందన్నారు.ఇప్పటి వరకూ 650మంది రైతులు ఆందోళనా సందర్భంగా ఛని పోయారని అన్నారు. లఖిం పూర్ ఖేర్ ఘటనలో మరి 5మంది చనీ పోయారని అన్నారు. ఘటనకు సంబంధించిన కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్ కుమార్ మిశ్రా ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ప్రైవేట్ వారికి ఇచ్చే ప్రక్రియను వేగ వంతం చేసిందని అన్నారు. దేశ విమానయాన రంగంలో ఎయిర్ ఇండియా సంస్థ అనేక లాభాల్లో వుందని అన్నారు.18,500కోట్ల రూపాయల విలువ చేసే సంస్థను కేవలం 2500కోట్ల రూపాయల కు టాటా సంస్థకు అప్పజెప్పడం దారుణమన్నారు. దీనితో పాటు టాటా వారికి వేల కోట్ల రూపాయల బ్యాంక్ రుణాలు ఇవ్వడానికి అంగీకారం కుదిరిందన్నారు.రైల్వే,ఓడ రేవులు,ప్రభుత్వ రంగ సంస్థలు పూర్తిగా ప్రైవేట్ వారికి అప్పచెప్పరాని అన్నారు.మానిటైజేషన్, నగ ధికరణతో నేషనల్ హైే వే లను లీజుకు ఇస్తున్నారని అన్నారు.
టోల్గేట్ల వద్ద కార్మికులు లేకుండా ఫాస్ట్ టాగ్ పేరుతో వేలకోట్ల రూపాయలు లాభాలు రాబట్టు కుంటున్నరని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్మిక వర్గం,రైతులు,వ్యవసాయ కార్మికులు ఐక్యంగా పోరాటాలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు.పటాన్ చెరు ప్రాంతం కార్మిక వర్గ పోరాటాలకు అనువైన ప్రాంతమని తెలిపారు.ఇక్కడ కార్మిక వర్గం కోసం పని చేయాలని సూచించారు.సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేష్,కార్య దర్శి వర్గ సభ్యులు జయరాజ్ మాట్లాడారు.ఈ కార్య క్రమంలో ఏరియా కమిటీ కన్వీనర్ నర్సింహారెడ్డి,కమిటీ సభ్యులు పాండురంగా రెడ్డి.నాగేశ్వరరావు,శ్రీనివాసరావు,జార్జ్,ప్రభాకర్,పెంటయ్యలు పాల్గొన్నారు.అనంతరం నూతన కమిటీని ఎన్ను కోవడం జరిగింది.మహాసభ ప్రారంభానికి ముందు పార్టీ పతాకాన్ని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేష్ ఆవిష్కరించారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…