గెటిఆర్ఎస్ యువనాయకులు గూడెం విక్రమ్ రెడ్డి ధీమా
పటాన్చెరు
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కి మద్దతుగా పటాన్చెరు టిఆర్ఎస్ యువనాయకుల బృందం ప్రచారం నిర్వహించింది. గురువారం హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం అంకుశాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు గూడెం విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ భారీ విజయానికి గెలుపు బాటలు గా మారుతున్నాయని అన్నారు.
ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. హుజురాబాద్ అభివృద్ధికి టిఆర్ఎస్ పార్టీ ఆవశ్యకతను ప్రజలు గుర్తించారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర నాయకులు మెరాజ్ ఖాన్, విద్యార్థి విభాగం జిల్లా కోఆర్డినేటర్ కృష్ణకాంత్, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు శ్యామ్ సుందర్ రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షులు చెన్నారెడ్డి, నాయకుడు తరుణ్ రెడ్డి, మల్లేష్ యాదవ్, సోహైల్ ఖాన్, రవికుమార్, సంపత్, జబ్బార్, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , మియాపూర్: సమాజ సేవే లక్ష్యంగా నిరంతరం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న యలమంచి ఉదయ్…
గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రివర్యులు, బిఆర్ఎస్ పార్టీ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ శ్రీ తన్నీరు…
పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: దేశ వ్యాప్త పల్స్…
ఆల్విన్ కాలనీ చౌరస్తాలో భూమిపూజ నిర్వహించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి నేటి తరం యువత శివాజీ మహారాజ్ జీవితాన్ని…
పటాన్చెరులో మహిళా కాంగ్రెస్ శక్తి ప్రదర్శన గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం మనవార్తలు…
బూట్ క్యాంపు మెంటర్ గా గీతం అధ్యాపకుడు రెండు వారాల పాటు మార్గదర్శనం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: వియత్నాంలోని…