Telangana

చిట్కుల్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తిచేసి అర్హులైన పేదలకు ఇ వ్వాలి సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ఇస్నాపూర్ మున్సిపల్ లోని చిట్కుల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి, అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని, కోర్టులో ఉన్న సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి బి నాగేశ్వరరావు సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. ఆదివారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చిట్కుల్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ నిర్మించిన ఇండ్ల సముదాయాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ చిట్కుల్ గ్రామంలో 329 సర్వే నెంబర్లో ఐదు ఎకరాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాన్ని గత 15 సంవత్సరాల క్రితం ప్రారంభం చేసి, ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణాన్ని మధ్యలోనే వదిలేశారని. డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయంలో భూములు కోల్పోయిన వారికి వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని, కోర్టులో కొనసాగుతున్న కేసును వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. 329 సర్వే నెంబర్లలో ఇల్లు నిర్మించుకున్న వారికి పట్టా సర్టిఫికెట్లు ఇవ్వాలని, రెవెన్యూ వారు చేస్తున్న కూల్చివేతలను వెంటనే ఆపివేయాలన్నారు.బచ్చు గూడెం, కర్దనూర్, పటేల్ గూడా, నాగులపల్లిలో వేలాది మంది కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఎక్కడ స్థానికులకు ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని పెండింగ్ లో ఉన్న వాటిని పూర్తిచేసి అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని లేనిపక్షంలో పేదల పక్షాన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ ఏరియా కమిటీ సభ్యులు ఆర్ శాంత కుమార్, నల్లగండ్ల రాజు, సిపిఎం పార్టీ నాయకులు జె పోచయ్య,రాజ్ కుమార్ ఇతరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago

ఫార్మాస్యూటికల్ పరిశోధనలో ఎస్.వి.నూకరాజుకు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: దీర్ఘకాలిక వాపు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదు లోని గీతం స్కూల్…

2 days ago

పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆపత్కాలంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారిందని, నిరుపేదల ఆరోగ్య భద్రతకు…

3 days ago

గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ

ఎం.ఫార్మ్. కోర్సు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని…

3 days ago