మన వార్తలు ,పటాన్చెరు:
పటాన్చెరు శాంతి నగర్ కాలనీలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సత్యసాయిబాబా 96వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో భాగంగా ట్రస్ట్ వారు చిన్నారులకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన చిన్నారులకు కార్పొరేటర్ గారి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం చేశారు.
అనంతరం మాట్లాడుతూ అందరిలానే విద్యార్థిగా జీవితాన్ని మొదలుపెట్టి ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం సృష్టికర్తగా ఎదిగారు. బాబా బోధనలు అద్వైత సిద్ధాంతానికి దగ్గరగా ఉంటాయి. మానవులు అరిషడ్వర్గాలను జయించి ఉత్తములుగా ఉండాలని, పరిశుధ్ధ హృదయంతో జీవించాలనీ తమ ఉప న్యాసాల్లో బోధిస్తుంటారని ప్రార్థించే పెదవులకన్నా సేవించే చేతులు మిన్న అని నిత్యం సత్యసాయిబాబా భగవాన్ అంటూ ఉంటారు ప్రతి ఒక్కరు సహాయం చేయాలనే లక్ష్యంగా ముందుకు సాగాలని ఎల్లప్పుడూ చెబుతారని అన్నారు సత్య సాయి సేవా సంస్థల అధ్వర్యంలో అనేక సేవాకార్యక్రమాలు నిరంతరాయంగా నేటికీ జరుగుతుండటం విశేషం.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాయ్ కాడి హారిక విజయ్ కుమార్ గారు పాల్గొనడం జరిగింది.
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…