Telangana

నియోజకవర్గ పాస్టర్ల సమావేశాన్ని జయప్రదం చేయండి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

బిఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్ సభ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా మే 4న పటాన్చెరులో నిర్వహించ తలపెట్టిన నియోజకవర్గ స్థాయి చర్చి పాస్టర్ల సమావేశాన్ని జయప్రదం చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం పటాన్చెరులో నియోజకవర్గ ముఖ్య చర్చి పాస్టర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటులో తెలంగాణ వాదం బలంగా వినిపించాలంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గత 10 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలోని క్రిస్టియన్ మైనార్టీల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించడంతోపాటు, సొంత నిధులతో 30కి పైగా చర్చిలు నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు. వీటితో పాటు క్రిస్టియన్ల కోసం ఐదు ఎకరాలను స్మశాన వాటిక కోసం కేటాయించడం జరిగిందని తెలిపారు. మెదక్ బరిలో నిలిచిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి విజయానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో.. పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ జెడ్పిటిసి బాల్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ విజయకుమార్, నగేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు..

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago