పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
బిఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్ సభ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా మే 4న పటాన్చెరులో నిర్వహించ తలపెట్టిన నియోజకవర్గ స్థాయి చర్చి పాస్టర్ల సమావేశాన్ని జయప్రదం చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం పటాన్చెరులో నియోజకవర్గ ముఖ్య చర్చి పాస్టర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటులో తెలంగాణ వాదం బలంగా వినిపించాలంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గత 10 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలోని క్రిస్టియన్ మైనార్టీల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించడంతోపాటు, సొంత నిధులతో 30కి పైగా చర్చిలు నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు. వీటితో పాటు క్రిస్టియన్ల కోసం ఐదు ఎకరాలను స్మశాన వాటిక కోసం కేటాయించడం జరిగిందని తెలిపారు. మెదక్ బరిలో నిలిచిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి విజయానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో.. పటాన్చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ జెడ్పిటిసి బాల్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ విజయకుమార్, నగేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు..
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…