Districts

కేంద్రం దిగి వచ్చే వరకు నిరంతర పోరాటం..

_ఢిల్లీలో తెలంగాణ సత్తా చాటుతాం

_ముంబై జాతీయ రహదారిని దిగ్బంధం

_ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

మనవార్తలు ,పటాన్‌చెరు:

తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యం కొనుగోలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు బుధవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతన పటాన్చెరు పట్టణంలోని ముంబాయి జాతీయ దిగ్బంధం చేశారు. ఈ ఈ కార్యక్రమానికి మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డిలతో పాటు నియోజకవర్గంలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గత రెండు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం స్పందించకపోవడం వారికి రైతుల పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలోని బిజెపి నాయకులు సైతం రైతుల పట్ల వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారని, గ్రామాల్లోని రైతులు బిజెపి నాయకుల బట్టలు విప్పి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈ నెల 11వ తేదీన ఢిల్లీలో నిర్వహించబోయే ధర్నాలో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సత్తా చాటుతాం అన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు నిరసన పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

8 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago