_యువత అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
_పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
యువత చెడు వ్యసనాలతో పెడదారి పట్టకుండా, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు డివిజన్ పరిధిలోని గోనెమ్మ బస్తిలో 30 లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించిన గోనెమ్మ యూత్ అసోసియేషన్ భవనాన్ని ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవ సమాజ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యువత అభివృద్ధికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. విద్యారంగం తో పాటు క్రీడల్లో రాణిస్తున్న యువతకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ కు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు రాజు, నాయకులు, పుర పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: పటాన్చెరు నియోజకవర్గం, ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని ఐనోలు గ్రామంలో సోమవారం శ్రీశ్రీశ్రీ మల్లికార్జున స్వామి…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ జెడ్పీటీసీ…
పటాన్చెరులో ఘనంగా ప్రారంభమైన 36వ మైత్రి క్రికెట్ కప్ పోటీలు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువత…
ఐదు రోజుల బూట్ క్యాంప్ ప్రారంభోత్సవంలో సీ-డాక్ హైదరాబాద్ నిపుణుడు ప్రణయ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మన దేశ…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఆర్కిటెక్చర్ విద్య, కెరీర్ అవకాశాల గురించి ఇంటర్మీడియెట్ విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించే లక్ష్యంతో,…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని…