– చట్టపరంగా ధీటుగా ఎదుర్కొంటాo – బీఆర్ఎస్!
మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి :
తమ పై ఎన్ని కేసులు పెట్టి భయపెట్టాలనే కుట్రలు చేసినా తాము భయపడమని, చట్టపరంగా ధీటుగా ఎదుర్కొంటామని బీఆర్ఎస్ పార్టీ నేతలు తెలిపారు.ఇటీవల శేరిలింగంపల్లి బి ఆర్ ఎస్ నాయకులు మారబోయిన రవి యాదవ్ కు మియాపూర్ పోలీసు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. బుధవారం రోజు పోలీస్ స్టేషన్ కు రవి యాదవ్ హాజరై, తనపై నమోదు చేసిన అసత్య, అక్రమ కేసుకు సంబంధించి జారీ చేసిన నోటీసుకు సమాధానంగా లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చినట్లు రవి యాదవ్ అన్నారు. రా సందర్భంగా బీఆర్ఎస్ లీగల్ టీమ్ సభ్యులు అడ్వకేట్ లక్ష్మణ్ తో కలిసి మియాపూర్ సీఐకి అధికారిక రిప్లై లెటర్ సమర్పించారు. ఎమ్మెల్యే అరికాపూడి గాంధీ అనుచరులు నమోదు చేసిన తప్పుడు కేసును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, బీఆర్ఎస్ లీగల్ టీమ్ హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను పోలీసులకు సమర్పించించరనీ తెలిపారు.
ఈ సందర్భంగా రవి యాదవ్ ధీటుగా స్పందిస్తూ
“ప్రజల సమస్యలు లేవనెత్తితే కేసులు పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైందనీ,ఒక్క కేసు పెడితే భయపడతామనుకుంటే అది వారి అజ్ఞానమే అని అన్నారు.తాము భయపడే వాళ్లం కాదనీ, చట్టపరంగా కూడా, ప్రజల మధ్య కూడా పోరాటం కొనసాగుతుంన్నారు.ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.రవి యాదవ్ కు అండగా నిలుస్తూ శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో మియాపూర్ పోలీస్ స్టేషన్కు చేరుకుని మద్దతు పలికారు.ఈ కార్యక్రమంలో అడ్వకేట్ శుభురాజ్, వాలా హరీష్ రావు, ఎర్రబెల్లి సతీష్, మాజీ కార్పొరేటర్, నవతా రెడ్డి, గోపురాజు శ్రీనివాస్, రామకిషన్ గౌడ్, రోజా, కలిదిండి, బి ఎస్ ఎన్ కిరణ్ యాదవ్,, విజయ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఆర్. కార్తికేయ, అలావుద్దీన్ పటేల్, సురేష్ యాదవ్, శ్రీకాంత్, సంగారెడ్డి, షేక్ జమీర్, శివరాజ్ ముదిరాజ్, మల్లేష్, గణేష్ రెడ్డి, మజిత్, సంతోష్ నాయుడు, ముజీబ్, శ్రీనివాస్ రావ్ తదితరులు పాల్గొన్నారు
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…
మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి : రాయదుర్గం, దర్గా, మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎ. భరత్ కుమార్ గౌడ్ గచ్చిబౌలి డివిజన్…
మనవార్తలు ప్రతినిధి ,శేరిలింగంపల్లి : ఎన్ఎంజి చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు హఫీజ్ పేట్ డివిజన్ యువనాయకుడు నిమ్మల ధాత్రీనాథ్ గౌడ్…
భద్రతే మొదటి ప్రాధాన్యం అవగాహన – భాగస్వామ్యం – సాధికారత”తో ఉద్యోగుల్లో భద్రతా చైతన్యం పెంపు ప్రతి పనిదినం భద్రతతోనే…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత, గణాంక శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి…