Telangana

సనాతన ధర్మ పరిరక్షకుడు హిందు సామ్రాట్ సర్వ మానవాళికి దిక్సూచి ఛత్రపతి శివాజీ _ మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతిని సందర్భంగా పటాన్ చేరు నియోజవర్గం పాశమైలారం గ్రామ పరిధిలోని ఛత్రపతి శివాజీ యువసేన వారి అధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి జయంతి శుభాకాంక్షలు తెలియజేసిన పటాన్ చేరు మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ అనంతరం మాట్లాడుతూ శివాజీ అజేయ స్ఫూర్తిని, దార్శనిక నాయకత్వాన్ని, భారత చరిత్రకు చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారుఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క అజేయమైన స్ఫూర్తి, ధైర్యం మరియు తన ప్రజల పట్ల నిబద్ధత తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని అన్నారు.శివాజీ మహారాజ్ గారి ప్రతిభ యుద్ధంలోనే కాదు, పరిపాలనలోనూ ఉందని,ఆయన సమర్థవంతమైన పాలనను స్థాపించాడు, ఆదాయ సేకరణలో సంస్కరణలను అమలు చేశాడు, మరియు క్రమశిక్షణ కలిగిన సైనిక నిర్మాణాన్ని నిర్వహించాడని తెలిపారు. గొప్ప పరిపాలకుడిగా , ఉదార పౌర పాలన స్థాపకుడిగా కీర్తిని పొందారని చెప్పారు . ఆయన గాథలు యువతకు స్ఫూర్తిదాయకమన్నారు .ఈ కార్యక్రమంలో నవీన్ రెడ్డి,వీరేష్ గౌడ్,సంతోష్,బుమేష్,వినోద్,వేణుగోపాల్,మరియు శివాజీ యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago