Telangana

కాంగ్రెస్ ముదిరాజులకు ఇచ్చిన హామీని నిలబెడుతుంది ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర జ్ఞానేశ్వర్

మనవార్తలు ప్రతినిధి ,  శేరిలింగంపల్లి :

కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులకు ఇచ్చిన హామీని నిలబెడుతుందని ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బోర జ్ఞానేశ్వర్ అన్నారు.తెలంగాణ ఐక్య ముదిరాజ్ శేర్లింగంపల్లి నియోజకవర్గం ఖానా మెట్ శాఖ పదవి వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ లో ముదిరాజులకు బిసి-డి నుండి బిసి ఏలో చేర్చే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ బిసి సమాజంలో మొదటి వరుసలో ఉన్న ముదిరాజులు రాజకీయంగా ఇంకా వెనుకబడి ఉన్నారని ముదిరాజులకు మంచి అవకాశం కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం ముదిరాజులకు ఎలాంటి మేలు చేయలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ కుటుంబ సర్వే నిర్వహించి తెలంగాణలో ఉన్న వివిధ సామాజిక వర్గాల స్థితిగతులపై సమగ్ర నివేదిక ఇచ్చిందని ఆయన తెలిపారు. ఆ నివేదిక ప్రకారం సామాజిక వర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన తెలిపారు. ముదిరాజ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివయ్య ముదిరాజ్ మాట్లాడుతూ జనాభా లెక్కల ప్రాతిపదికన తెలంగాణ ప్రభుత్వం ముదిరాజు లెక్కన చూపించడం చాలా సంతోషకరమైన విషయమని అదే విధంగా ముదిరాజ్ వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తులకు ప్రభుత్వం వెనువెంటనే పథకాలను ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి కృషి చేయాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో యాదవ కార్పొరేషన్ చైర్మన్ రఘునాథ్ యాదవ్, శేర్లింగంపల్లి కాంగ్రెస్ నేర్కవర్గం ఇన్చార్జి జగదీష్ గౌడ్,ఖానా మెట్ శాఖ అధ్యక్షులు కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి సుధాకర్, ఆలయ కమిటీ అధ్యక్షులు సతీష్ ముదిరాజ్, రాష్ట్ర నాయకులు వివిధ ముదిరాజ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

1 hour ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago