Telangana

మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మెదక్ పార్లమెంటు నుంచి పోటీలో ఉన్న బిజెపి, బిఆర్ఎస్ అభ్యర్థులు ఇద్దరూ కూడా దొంగలేనని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రివర్యులు, మెదక్ పార్లమెంట్ ఇన్చార్జ్ కొండా సురేఖ అన్నారు. పటాన్ చెరు మండలంలోని రుద్రారం గ్రామంలోని గణేష్ గడ్డ లో గల శ్రీ గణేష్ దేవాలయం లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, టీపీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సంగారెడ్డి డిసిసి ప్రెసిడెంట్ నిర్మల, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు లతో కలిసి ప్రచార రథాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి , జెండా ఊపి ప్రచార రథాలను ప్రారంభించారు ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ రెండోసారి కూడా ఈ తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ కు పట్టం కడితే, వారిలో ఎటువంటి మార్పులు రాలేదని, ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని , అసెంబ్లీ కి రానటువంటి మాజీ సీఎంకేసీఆర్ ఎన్నికలు రావడంతోనే బయటకు వచ్చారని ఆరోపించారు. సామాన్యుల ఫైళ్లను టేబుల్ ఫైళ్లను పక్కన పెట్టిన మాజీ సీఎం కేసీఆర్ కేవలం మేడిగడ్డ మిషన్ భగీరథ వంటి ఫైళ్ళ పైనే సంతకాలను చేస్తూ పరిపాలన కొనసాగించారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాల అమలను ఇంటింటికి తీసుకుపోయి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పార్టీ నాయకులకు సురేఖ సూచించారు. అలాగే ఈ ఎంపీ ఎన్నికలే నాయకుల భవిష్యత్తును డిక్లేర్ చేస్తాయని కూడా పేర్కొన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేసి ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ నాయకులు కార్యకర్తలను ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ ఎలక్షన్స్ పటాన్చెరు కోఆర్డినేటర్ శ్యామ్ గౌడ్, దేవస్థాన కమిటీ చైర్మన్ వెంకన్న, పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గ ఇంచార్జ్ లు, జిల్లా కాంగ్రెస్, బ్లాక్ కాంగ్రెస్, మునిసిపల్, పట్టణ, పలు గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago