అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి
వెంటనే వెనిజులా అధ్యక్షుని విడుదల చెయ్యాలి
శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
వెనిజులా పై అమెరికా పాశవిక దాడిని ప్రపంచమంతా ముక్తకంఠంతో ఖండించాలని శాండ్విక్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎమ్ మనోహర్ అన్నారు.వెనిజులా పై అమెరికా దుశ్చర్యను నిరసిస్తూ పటాన్ చెరు పారిశ్రామిక వాడ లో శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన, ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శాండ్విక్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎమ్ మనోహర్ మాట్లాడుతూ వెనిజులా లో ఉన్న అపారమైన చమురు, ఖనిజాలపై అమెరికా ఎప్పటినుండో కన్నువేసి అనధికార పెత్తనం చెలాయిస్తూ నేడు అత్యంత పాశవిక దాడికి పాల్పడిందని విమర్శించారు. అమెరికా దుశ్చర్యలను అందరూ ముక్తకంఠంతో ఖండించాలని, ఐక్యరాజ్య సమితి తక్షమే జోక్యం చేసుకోవాలని, వెనిజులా అధ్యక్షుడిని తక్షణమే విడుదల చెయ్యాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో శాండ్విక్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ఎ. వీరారావు, జాయింట్ సెక్రటరీ వి సదాశివ రెడ్డి, కమిటీ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…