Telangana

వెనుజులపై అమెరికన్ దాడిని ఖండించండి సిఐటియు జిల్లా కోశాధికారి కే రాజయ్య

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

అమెరికన్ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని సిఐటియు జిల్లా కోశాధికారి కేరాజయ్య అన్నారు. వెనుజుల పై అమెరికన్ దాడిని నిరసిస్తూ ఆదివారం సిఐటియు ఆధ్వర్యంలో పటాన్ చెరు పట్టణం లో శ్రామిక్ భవన్ నుంచి జాతీయ రహదారి వరకు నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ వెనిజులపై దాడిని ప్రపంచం మొత్తం ఖండించాలని ఆయన విజ్ఞప్తి చేశారు, ఒక దేశం పై అమెరికా పెత్తనం ఏమిటి అని ప్రశ్నించారు, టెర్రరిస్టుల కంటే భయంకరంగా అమెరికన్ సైన్యం విరుచుకుపడిందన్నారు.ఒక దేశ అధ్యక్షుడు భవనంపై రాత్రిపూట దాడి చేసి, ప్రజల ప్రాణాలు తీసి అధ్యక్షుని అతని భార్యని కిడ్నాప్ చేయడం ఏమిటని, అమెరికాకు ఎవరు హక్కు ఇచ్చారని ప్రశ్నించారు.

అమెరికా చేస్తున్న అరాచకాన్ని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాలని,అమెరికన్ సామ్రాజవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు, గత అనేక సంవత్సరాల నుంచి వెనుజుల దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని, తమ చెప్పు చేతిలో ఉంచుకోవాలని అమెరికా కోరుకున్నదన్నారు, ప్రపంచంలోనే వెనుజులలో ప్రత్యమయ ఆర్థిక విధానాలను అమలు చేస్తున్న దేశమని, అది ప్రజా ప్రభుత్వమని ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వెనిజులలో ఇంధన నిక్షేపాలు గనినీయంగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.

ఇంధనం పైన పెత్తనం కోసమే అమెరికన్ దాడి చేసిందని చెప్పారు. ఇప్పటి వరకు వెనుజుల అధ్యక్షుడి భార్య ఎక్కడ ఉందో కూడా ప్రకటన చేయలేదని, వెంటనే మీడియాకు చూపించాలని, వెనిజుల నుంచి అమెరికన్ సైన్యం వెంటనే వెనుకకు వెళ్లాలని డిమాండ్ చేశారు. అమెరికన్ దానిని భారత దేశ ప్రజలు, సంఘాలు, పార్టీలు ఖండించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, నాయకులు శ్రీనివాస్, రామకృష్ణ, సాయన్న, నరసింహారెడ్డి, నరసింహులు, నారాయణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

11 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

11 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

11 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

11 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

11 hours ago