మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
అమెరికన్ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని సిఐటియు జిల్లా కోశాధికారి కేరాజయ్య అన్నారు. వెనుజుల పై అమెరికన్ దాడిని నిరసిస్తూ ఆదివారం సిఐటియు ఆధ్వర్యంలో పటాన్ చెరు పట్టణం లో శ్రామిక్ భవన్ నుంచి జాతీయ రహదారి వరకు నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగినది.ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ వెనిజులపై దాడిని ప్రపంచం మొత్తం ఖండించాలని ఆయన విజ్ఞప్తి చేశారు, ఒక దేశం పై అమెరికా పెత్తనం ఏమిటి అని ప్రశ్నించారు, టెర్రరిస్టుల కంటే భయంకరంగా అమెరికన్ సైన్యం విరుచుకుపడిందన్నారు.ఒక దేశ అధ్యక్షుడు భవనంపై రాత్రిపూట దాడి చేసి, ప్రజల ప్రాణాలు తీసి అధ్యక్షుని అతని భార్యని కిడ్నాప్ చేయడం ఏమిటని, అమెరికాకు ఎవరు హక్కు ఇచ్చారని ప్రశ్నించారు.
అమెరికా చేస్తున్న అరాచకాన్ని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాలని,అమెరికన్ సామ్రాజవాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు, గత అనేక సంవత్సరాల నుంచి వెనుజుల దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని, తమ చెప్పు చేతిలో ఉంచుకోవాలని అమెరికా కోరుకున్నదన్నారు, ప్రపంచంలోనే వెనుజులలో ప్రత్యమయ ఆర్థిక విధానాలను అమలు చేస్తున్న దేశమని, అది ప్రజా ప్రభుత్వమని ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వెనిజులలో ఇంధన నిక్షేపాలు గనినీయంగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
ఇంధనం పైన పెత్తనం కోసమే అమెరికన్ దాడి చేసిందని చెప్పారు. ఇప్పటి వరకు వెనుజుల అధ్యక్షుడి భార్య ఎక్కడ ఉందో కూడా ప్రకటన చేయలేదని, వెంటనే మీడియాకు చూపించాలని, వెనిజుల నుంచి అమెరికన్ సైన్యం వెంటనే వెనుకకు వెళ్లాలని డిమాండ్ చేశారు. అమెరికన్ దానిని భారత దేశ ప్రజలు, సంఘాలు, పార్టీలు ఖండించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, నాయకులు శ్రీనివాస్, రామకృష్ణ, సాయన్న, నరసింహారెడ్డి, నరసింహులు, నారాయణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…