Telangana

గ్రామాల సమగ్ర అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_ఇంద్రేశం గ్రామంలో జి.వి.ఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో 7 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన

_అమీన్పూర్ మండలం వడకపల్లి గ్రామంలో కోటి 95 లక్షల రూపాయల వ్యయంతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతోపాటు, పరిశ్రమల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తున్నామని అన్నారు. పటాన్చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామంలో జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో 7 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గ్రామంలో చేపట్టనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు స్థానిక ప్రజాప్రతినిదులతో కలిసి శంకుస్థాపన చేశారు.అమీన్పూర్ మండల పరిధిలోని వడక్పల్లి గ్రామంలో ఒక కోటి 95 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి గ్రామంలో శరవేగంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేస్తూ పూర్తి పారదర్శకతతో పరిపాలన అందిస్తున్నామన్నారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు లాంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. జివిఆర్ ఎంటర్ప్రైజెస్ సౌజన్యంతో వివిధ గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.పటాన్చెరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం రోజు రోజుకి విస్తరిస్తోందని, ఇందుకు అనుగుణంగా ఏర్పడుతున్న నూతన కాలనీలలో మౌలిక వసతులు కల్పనకు నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అమీన్పూర్ ఎంపీపీ దేవానందం, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, అంతిరెడ్డి, రామచంద్ర రెడ్డి, ఇంద్రేశం గ్రామ సర్పంచ్ నర్సింలు, వడకపల్లి గ్రామ సర్పంచ్ లలిత మల్లేష్, ఉపసర్పంచ్ బండి శంకర్, శ్రీకాంత్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు , సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago