Telangana

గ్రామాల సమగ్ర అభివృద్ధి మా లక్ష్యం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మెదక్ ఎంపీ రఘునందన్ రావు తో కలిసి గుమ్మడిదల మండలంలో ఎన్ఆర్ఇజిఎస్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మనవార్తలు ప్రతినిధి , గుమ్మడిదల :

గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తూ నిధులు కేటాయిస్తున్నామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.బుధవారం గుమ్మడిదల మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి, రామిరెడ్డిబావి, కానుకుంట గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన వివిధ అభివృద్ధి పనులకు మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత అందిస్తున్నామని తెలిపారు. గ్రామాలలో అంతర్గత రహదారులతో పాటు గ్రామాల మధ్య అనుసంధాన రోడ్లను నిర్మిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు పరిశ్రమల భాగస్వామ్యంతో సిఎస్ఆర్ నిధులు సైతం అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉమాదేవి, పంచాయతీరాజ్ డిఈ సురేష్, గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, విజయ్ భాస్కర్ రెడ్డి, బాల్ రెడ్డి, షేక్ హుస్సేన్, కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago