మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :
చందానగర్ సర్కిల్ పరిధిలోని మియాపూర్ సర్వే నెంబర్ 41 లోని ప్లాట్ నెంబర్ 59 ఏ, లోని 100 గజాలలో 6 అంతస్థుల అక్రమ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుందని, ఇది నగరంలోని నడిబొడ్డిన అత్యంత రద్దీ ప్రాంతoలో ఉందని, ఈ అక్రమ నిర్మాణం పై చర్యలు తీసుకోవాలని కోరుతూ మియాపూర్ డివిజన్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ముద్దంగుల తిరుపతి టౌన్ ప్లానింగ్ అధికారులకు పిర్యాదు చేశారు. పరిమితులకు మించి ఎటువంది షరతులకు లోబడి నిర్మాణం జరగడం లేదని, ఇది ఆత్యంత ప్రమాదకరంగా మారిందని తెలిపారు..6 ఫ్లోర్ ల భవనానికి తీసుకోవాల్సిన అనుమతులు ఏమి లేవని, నిర్మాణ పనులు ఆపాలని కోరారు. అగ్నిమాపక నిబంధనలు ఏమి లేవని, ఏవైనా ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.ప్రమాదకరంగా జరుగుతున్న నిర్మాణం పై వెంటనే చర్యలు తీసుకొని, ఈ ఆక్రమ నిర్మాణం పై, నదరు బిల్డింగ్ ను కూల్చివేయాలని అయన కోరారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…