Hyderabad

చదువుతోనే సమాజ అభివృద్ధి : యండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు

గుమ్మడిదల:

చదువుతోనే సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని యండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు అన్నారు. గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామం లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు 32 ఇంచుల ఎల్ఈడి టీవీని శనివారం ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామస్తులకు యండిఆర్ పౌండేషన్ తరఫున దేవేందర్ రాజు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా ప్రభావంతో ఆన్ లైన్ తరగతులు నడుస్తున్న సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్రామస్తుల అభ్యర్థన మేరకు టీవీని అందజేసినట్లు తెలిపారు. దీనివల్ల పేద విద్యార్థుల చదువులు సజావుగా సాగుతాయన్నారు.

నేటి బాలల భవిష్యత్తుకు వెలుగు చూపే ఆయుధం విద్య అన్నారు. వారందరూ ఉన్నత చదువులు చదివి సుఖవంతమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో ఎక్కడా సామూహిక సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. యండిఆర్ ఫౌండేషన్ ద్వారా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో తమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో తమ కార్యక్రమాలు మరింత విస్తృతం చేయనున్నట్లు తెలిపారు.

 

కార్యక్రమంలో గుమ్మడిదల ముదిరాజ్ సంఘము అధ్యక్షుడు గ్యారాల మల్లేష్, ఉపాధ్యక్షుడు యాదగిరి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రదీప్ కుమార్, వెంకటేష్, కోశాధికారి వీరేశ్, అనంతారం మాజీ ఉపసర్పంచ్ గోపాల్ చక్రపాణి, తిరుమల, నిర్మల కుమారి, కవిత, నిర్మల, యండిఆర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధు తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

10 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

10 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

10 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

22 hours ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

1 day ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago