Telangana

నూతన సంవత్సరంలో మెదక్‌పై సీఎం ప్రత్యేక దృష్టి

మెదక్ అభివృద్ధికి నూతన ఏడాదిలో నూతన ఊపు

సీఎం రేవంత్ రెడ్డికి నీలం మధు న్యూ ఇయర్ శుభాకాంక్షలు

రేవంత్ రెడ్డిని కలిసిన నీలం మధు – అభివృద్ధిపై కీలక చర్చ

సీఎం రేవంత్ రెడ్డితో నీలం మధు కీలక భేటీ

మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మెదక్ పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రితో నీలం మధు సుదీర్ఘంగా చర్చించారు. పటాన్‌చెరు ప్రాంతంలో ప్రజల సౌకర్యార్థం రెండు జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాలు, అలాగే రెండు నూతన పోలీస్ స్టేషన్లను మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ నిర్ణయాల వల్ల పరిపాలన మరింత ప్రజలకు చేరువ అవుతుందని, శాంతి భద్రతలు పటిష్టం అవుతాయని నీలం మధు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో డివిజన్ల సమగ్ర అభివృద్ధితో పాటు నూతనంగా ఏర్పాటు కానున్న మున్సిపాలిటీలకు తగిన నిధులు కేటాయించి అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.అదే సమయంలో మెదక్ పార్లమెంట్ పరిధిలో రానున్న మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలు మరియు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేలా పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీలం మధుకు సూచించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని తెలిపారు.దీనికి స్పందించిన నీలం మధు ముదిరాజ్, మెదక్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచే విధంగా నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి కట్టుగా పనిచేస్తామని ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రజల మధ్య ఉండి నిరంతరం సేవ చేస్తామని వెల్లడించారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago