Telangana

​బి.హెచ్.ఈ.ఎల్ బస్ డిపో నుండి సిటీ మరియు రూరల్ సర్వీసులను పునరుద్ధరించాలి

యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలు, విద్యార్థులు మరియు పారిశ్రామిక కార్మికుల రవాణా కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు. గతంలో బి.హెచ్.ఈ.ఎల్ బస్ డిపో నుండి ప్రజలకు అందుబాటులో ఉన్న సిటీ మరియు రూరల్ సర్వీసులను హెచ్.సి.యు డిపోలో విలీనం చేయడం వల్ల స్థానిక రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సికింద్రాబాద్ రీజియన్‌లో ఉన్న బి.హెచ్.ఈ.ఎల్ డిపోను జిల్లా డిపోగా మారుస్తూ రంగారెడ్డి రీజియన్‌లో కలపడం వల్ల స్థానిక ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు.​ప్రస్తుతం బస్సులు హెచ్.సి.యు మరియు కూకట్‌పల్లి వంటి దూర ప్రాంత డిపోల నుండి పటాన్‌చెరు బస్ స్టేషన్‌కు రావాల్సి వస్తోంది. తీవ్రమైన ట్రాఫిక్ జామ్ మరియు ఇతర సాంకేతిక కారణాల వల్ల బస్సులు సకాలంలో రాకపోవడంతో శంకర్ పల్లి, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, బొంతపల్లి కమాన్ వంటి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాల్సిన విద్యార్థులు, సామాన్య ప్రజలు గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది.

ఇది అటు సంస్థకు ఇంధనం వృథా కావడంతో పాటు ఆర్థిక భారంగా మారుతోంది, ఇటు ప్రజలకు అమూల్యమైన సమయం వృథా అవుతోంది.​తెలంగాణ ప్రభుత్వం కాలుష్య రహిత ప్రయాణం కోసం 2,000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతూ, రాష్ట్రవ్యాప్తంగా 14 కొత్త ఆర్టీసీ డిపోలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో పటాన్‌చెరు నియోజకవర్గ ప్రాధాన్యతను గుర్తించి, ఇక్కడ ప్రత్యేక ఎలక్ట్రిక్ బస్ డిపోను మరియు ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. పారిశ్రామిక కేంద్రమైన పటాన్‌చెరును ‘ఫోర్త్ సిటీ’ తరహాలో అభివృద్ధి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం, రవాణా రంగంపై ప్రత్యేక దృష్టి సారించి బస్సుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే, నియోజకవర్గ ప్రజలు మరియు విద్యార్థుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మెట్టు శ్రీధర్ హెచ్చరించారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago