పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రతిష్ఠాత్మక ‘సీఐఐ మెగా ప్లాంటేషన్ అవార్డు’తో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ను సత్కరించింది. సీఐఐ తెలంగాణ రాష్ట్ర వార్షిక సమావేశం- 2023-24, సుస్థిర తెలంగాణ నిర్మాణంపై సదస్సు సందర్భంగా ఈ ఆవార్డును ప్రదానం చేయగా, గీతం రెసిడెంట్డీ డైరక్టర్ వీవీఎస్ఆర్ వర్మ ఈ అవార్డును అందుకున్నట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.గీతం ప్రాంగణంలో గత ఏడాది సుమారుగా ఎనిమిది వేల మొక్కలను నాటి మెగా ప్లాంటేషన్ డ్రైవ్ లో చురుగ్గా పాల్గొన్నందుకు ఈ గుర్తింపు లభించినట్టు తెలిపారు. ఈ అవార్డును గత ఏడు సంవత్సరాలుగా గీతం అందుకుంటూ, పర్యావరణ సుస్థిరత పట్ల తన నిబద్ధతను చాటి చెబుతోందన్నారు.పర్యావరణ పరిరక్షణకు సహకరించడంలో విద్యార్థులు, సిబ్బంది అంకితభావంతో చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించిందని డీవీవీఎస్ఆర్ వర్మ హర్షం వెలిబుచ్చినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…