పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రతిష్ఠాత్మక ‘సీఐఐ మెగా ప్లాంటేషన్ అవార్డు’తో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ను సత్కరించింది. సీఐఐ తెలంగాణ రాష్ట్ర వార్షిక సమావేశం- 2023-24, సుస్థిర తెలంగాణ నిర్మాణంపై సదస్సు సందర్భంగా ఈ ఆవార్డును ప్రదానం చేయగా, గీతం రెసిడెంట్డీ డైరక్టర్ వీవీఎస్ఆర్ వర్మ ఈ అవార్డును అందుకున్నట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.గీతం ప్రాంగణంలో గత ఏడాది సుమారుగా ఎనిమిది వేల మొక్కలను నాటి మెగా ప్లాంటేషన్ డ్రైవ్ లో చురుగ్గా పాల్గొన్నందుకు ఈ గుర్తింపు లభించినట్టు తెలిపారు. ఈ అవార్డును గత ఏడు సంవత్సరాలుగా గీతం అందుకుంటూ, పర్యావరణ సుస్థిరత పట్ల తన నిబద్ధతను చాటి చెబుతోందన్నారు.పర్యావరణ పరిరక్షణకు సహకరించడంలో విద్యార్థులు, సిబ్బంది అంకితభావంతో చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించిందని డీవీవీఎస్ఆర్ వర్మ హర్షం వెలిబుచ్చినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…