మనవార్తలు,రామచంద్రపురం
రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ను అవమానపరిచిన ముఖ్యమంత్రికి పదవిలో కొనసాగే అర్హత లేదని వెంటనే రాజీనామా చేసి వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని గోదావరి అంజిరెడ్డి డిమాండ్ చేశారు.సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణం లో బిజెపి రాష్ట్ర మరియు జిల్లా కమిటి ఆదేశానుసారం రాష్ట్ర బిజెపి మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి పట్టణ బిజెపి పార్టీ కార్యాలయంలో జైభీందీక్షకు దిగారు. ఈ సందర్బంగా గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ ముఖ్య మంత్రి భారత రాజ్యాంగాన్ని మార్చాలని దళితులను మరియు డా. అంబేద్కర్ అవమానించే విధంగా మాట్లాడటం సరికాదు అని అన్నారు .
అదేవిధంగా 7సం ల కాలంలో దళితుణ్ని ముఖ్యమంత్రి చెస్తాను అని, మూడు ఎకరాల భూమి ఇస్తానని, దళితబందు అమలుచెస్తా అని అన్ని బూటకపు మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు అని అన్నారు. ఈ చేతకాని ముఖ్య మంత్రి రాజ్యాంగాన్ని మార్చాలనడం రాజ్యాంగం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని ఆమె అన్నారు .ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు అంజిరెడ్డి, ఓబీసీ మోచ అధ్యక్షులు యాదగిరి, మల్లేష్, రవీందర్ గౌడ్,లక్ష్మణ్, పెంటారెడ్డి, రాంబాబు, రాజు, కృష్ణ రెడ్డి, రమేశ్ గుప్తా, లక్ష్మణ్ గౌడ్, కటికే శ్రీను, శ్రీనివాస రావు, మైనారిటీ నాయకులు షఫి,సల్మాన్, బాబ్జీ,ప్రసాద్ రావు,అమృత,అజాజ్ తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…