మనవార్తలు,రామచంద్రపురం
రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ ను అవమానపరిచిన ముఖ్యమంత్రికి పదవిలో కొనసాగే అర్హత లేదని వెంటనే రాజీనామా చేసి వెంటనే దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని గోదావరి అంజిరెడ్డి డిమాండ్ చేశారు.సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పట్టణం లో బిజెపి రాష్ట్ర మరియు జిల్లా కమిటి ఆదేశానుసారం రాష్ట్ర బిజెపి మహిళా ప్రధాన కార్యదర్శి గోదావరి అంజిరెడ్డి పట్టణ బిజెపి పార్టీ కార్యాలయంలో జైభీందీక్షకు దిగారు. ఈ సందర్బంగా గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ ముఖ్య మంత్రి భారత రాజ్యాంగాన్ని మార్చాలని దళితులను మరియు డా. అంబేద్కర్ అవమానించే విధంగా మాట్లాడటం సరికాదు అని అన్నారు .
అదేవిధంగా 7సం ల కాలంలో దళితుణ్ని ముఖ్యమంత్రి చెస్తాను అని, మూడు ఎకరాల భూమి ఇస్తానని, దళితబందు అమలుచెస్తా అని అన్ని బూటకపు మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు అని అన్నారు. ఈ చేతకాని ముఖ్య మంత్రి రాజ్యాంగాన్ని మార్చాలనడం రాజ్యాంగం గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సరికాదని ఆమె అన్నారు .ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు అంజిరెడ్డి, ఓబీసీ మోచ అధ్యక్షులు యాదగిరి, మల్లేష్, రవీందర్ గౌడ్,లక్ష్మణ్, పెంటారెడ్డి, రాంబాబు, రాజు, కృష్ణ రెడ్డి, రమేశ్ గుప్తా, లక్ష్మణ్ గౌడ్, కటికే శ్రీను, శ్రీనివాస రావు, మైనారిటీ నాయకులు షఫి,సల్మాన్, బాబ్జీ,ప్రసాద్ రావు,అమృత,అజాజ్ తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…