Districts

ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని మార్చాలనడం మూర్ఖత్వం _బిఎస్పి అధ్యక్షులు వినయ్ కుమార్

మనవార్తలు , పటాన్ చెరు:

భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ అనుచిత వ్యాఖలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిరసనగా పటాన్ చెరు బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పటాన్ చెరు పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి కేసీఆర్ క్షమాపణ చెప్పాలని నిరసనవ్యక్తం చేశారు. అనంతరం బిఎస్పి నాయకులు తహశీల్ధారుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా పటాన్ చెరు నియోజకవర్గం బిఎస్పి అధ్యక్షులు వినయ్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం లోని ఆర్టికల్ 3ఏ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, దానిని హేళన చేస్తూ, దానికి తూట్లు పొడుస్తూ, అవహేళన చేస్తూ అపహాస్యం చేస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారు అని మండిపడ్డారు .

కేసిఆర్ రాజ్యాంగం పట్ల కానీ రాజ్యాంగాన్నినిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పట్ల ఎలాంటి చిత్తశుద్ధి లేదు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ఏర్పడడానికి మూల కారణం రాజ్యాంగం అని అన్నకేసిఆర్ ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చాలి అని అనడం ఎంతవరకు సమంజసం అని వారు సీఎంను ప్రశ్నించారు. ప్రపంచ దేశాలు అన్ని రాజ్యాంగాన్ని అది రాసిన అంబేద్కర్ ను గౌరవిస్తూ ఉంటే మొదటగ బీజేపీ పార్టీ, ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు.

రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలను బట్టి నీ ఇంట్లో రాజకీయ ఉద్యోగాలు కట్టబెట్టావని ఇటువంటి అంశాలను విమర్శించే హక్కు ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేదని ధ్వజమెత్తారు భారత జాతికి వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో తీవ్రపరిమాణాలను ఎదుర్కొంటారని బిఎస్పి నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పఠాన్ చేరు అసెంబ్లీ అధ్యక్షులు సుంకు వినయ్ కుమార్ ,అసెంబ్లీ ఇంఛార్జ్ సంజీవ ,అసెంబ్లీ ఉపాధ్యక్షుడు కుమ్మరి ప్రవీణ్,పఠాన్ చేరు మండల కన్వీనర్ వెంకటేశ్, కర్నె శ్రీధర్,గుమ్మడిదల మండల కన్వీనర్ నీరుడి శివకుమార్, తెల్లపూర్ పీన్సిపాలిటీ అధ్యక్షుడు దర్శన్ ,అమీన్ పూర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు రాములు,111 డివిజన్ అధ్యక్షుడు శ్రీశైలం ,113 డివిజన్ అధ్యక్షుడు మహేందర్,ఉపాధ్యక్షుడు బాలు రేవంత్ ,మరియు ప్రెసిడెంట్స్ బాను ,రామకృష్ణ ,కిరణ్ ,సామ్ సన్ మరియు బీఎస్పీ కార్యకర్తలుతదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

రఘునాథ్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారబోయిన రఘునాథ్ యాదవ్ ను తెలంగాణ…

17 hours ago

గీతంలో ముగిసిన భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ‘అధునాతన భావనలు, బోధనా పద్ధతులు, విద్యా సాధనాలు’ అనే అంశంపై భౌతికశాస్త్ర ఉపాధ్యాయుల కోసం…

20 hours ago

కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయం నుండి డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టండి

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ని కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

2 days ago

డిఆర్డిఏ, మెప్మ, రెవెన్యూ, ఎక్సైజ్, హెచ్ఎండిఎ శాఖల అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష

మహిళా సంఘాల ఆర్థిక అభ్యున్నతికి పెద్దపీట మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్, రైస్ మిల్ ఏర్పాటుకు త్వరలో భూమి…

2 days ago

నైపుణ్యాభివృద్ధికి గీతం పెద్దపీట

అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో విద్యార్థులకు మార్గనిర్దేశం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగంలో విద్యార్థులకు…

2 days ago

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

2 days ago