politics

నేడు పటాన్ చెరులో ఛట్ పూజ

 

_ఎమ్మెల్యే జిఎంఆర్ సహకారంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు

_మైత్రి మైదానంలో భారీ జాగరణ

_ముఖ్య అతిథిగా భోజ్ పురి నటుడు కేసరి లాల్ యాదవ్

 

మనవార్తలు ,పటాన్ చెరు:

విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు నెలవైన పటాన్చెరు నియోజకవర్గంలో మరో భారీ కార్యక్రమానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు అండగా నిలిచారు.మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజా సందర్భంగా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.ఇందుకు సంబంధించిన వివరాలను ఆదివారం ఉదయం సాకి చెరువు వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, ఉత్తర భారతీయుల అసోసియేషన్ ప్రతినిధి సందీప్ షా లు వెల్లడించారు.

నియోజకవర్గంలోని సబ్బండ వర్గాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే జిఎంఆర్ ఛట్ పూజా సందర్భంగా భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారని వారు తెలిపారు.సాకి చెరువు కట్టపై ఆదివారం సాయంత్రం నుండి సోమవారం ఉదయం వరకు నిర్వహించనున్న పూజల సందర్భంగా ప్రత్యేకంగా ఘాట్లు, లైటింగ్, మంచినీరు, గజ ఈతగాళ్లు, సంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.సోమవారం సాయంత్రం 6 గంటలకు స్థానిక మైత్రి మైదానంలో భోజ్పూర్ నటుడు కేసరి లాల్ యాదవ్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమానికి పటాన్చెరు నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుండి భారీ ఎత్తున ప్రజలు హాజరు కాబోతున్నట్లు తెలిపారు.ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలందరూ భారీ సంఖ్యలో కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

1 week ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago