Hyderabad

చిన్నారిని చంపిన కసాయి తల్లి, అమ్మమ్మ అరెస్ట్

శేరిలింగంపల్లి :

కల్లు తాగుడుగు బానిసై చెడుతిరుగుళ్లు తిరుగుటకు అడ్డువస్తుందని తలిచిన కసాయి తల్లి తన 5 ఏళ్ల కూతురుని దారుణంగా హత్య చేసి, ఆ హత్య ను తాను ఉంటున్న ఇంటి ఓనర్ పై నెట్టాలని చూసిని తల్లిని, ఆమెకు సహకరించిన ఆమె తల్లిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన ఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం చందానగర్ లోని శాంతినగర్ లో నివసించే వడ్డే యాదమ్మ కు 13 ఏళ్లక్రితం మీర్ పెట్ కు చెందిన రాము తో వివాహం అయింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ముగ్గురు పిల్లలు కాగా వివిధ కారణాలతో ఇద్దరు అబ్బాయిలు మృతి చెందారు. చీటికీ మాటికి మొగుడితో గొడవ పడడం తో రాము వాళ్ళ ఊరెల్లిపోయాడు.

యాదమ్మ చెడు తురుగుళ్లు తిరుగుతూ కళ్ళు తాగుతూ ఉంటుంది. తన వివాహేతర సంబంధాలకు అడ్డువస్తుందని భావించిన తన 5 ఏళ్ల కూతురు కృష్ణవేణి ని దారుణంగా చంపేసింది. తర్వాత తన ఇంటికి వచ్చిన తల్లి తిమ్మమ్మ లు కల్సి ఆ హత్య నేరాన్ని వాళ్ళ ఇంటి ఓనర్ పై వేయాలని చూసి వాళ్ళ ఇంట్లోని టివి. ఇతర ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పాప తండ్రి రాము ఈమె పై అనుమానంతో చందానగర్ పోలీసులుకు పిర్యాదు చేయగా పాప శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు పంపి, వచ్చిన రిపోర్ట్ ఆధారంగా యాదమ్మ, తల్లి తిమ్మమ్మ లను పోలీసులు అరెస్టుచేసి రిమాండ్ కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

శేరిలింగంపల్లి,శాంతినగర్ ,చందానగర్ ,పోలీస్ స్టేషన్,హాస్పిటల్ ,కృష్ణవేణి , పోస్టుమార్టం,శవాన్ని

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

2 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago