Telangana

పెన్నార్ లో బి ఆర్ టి యు జయకేతనం

_వరుసగా రెండోసారి ఘన విజయం

_విశ్వసనీయతకు మారుపేరు ఎమ్మెల్యే జిఎంఆర్ నాయకత్వం

_కలిసి పోటీ చేసిన సిఐటియు, ఐ ఎన్ టి యు సి కూటమికి తప్పని ఓటమి

_59 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పెన్నార్ పరిశ్రమలో నిర్వహించిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో బిఆర్టియు జయకేతనం ఎగరవేసింది. వరుసగా రెండుసార్లు గెలిచి కార్మికుల విశ్వాసాన్ని నిలబెట్టుకుంది. బుధవారం పరిశ్రమలో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో.. మొత్తం 508 ఓట్లకు గాను 507 ఓట్లు పోలయ్యాయి. ఇందులో రెండు ఓట్లు చెల్లక పోగా, బిఆర్టియు సంఘానికి 282 ఓట్లు, సిఐటియు ఐ ఎన్ టి యు సి ఐక్య కూటమికి 223 ఓట్లు పోలయ్యాయి. 59 ఓట్ల మెజారిటీతో బిఆర్టియు వరుసగా రెండవసారి ఘన విజయం సాధించింది. పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మార్గదర్శకత్వంలో బి ఆర్ టి యు తరఫున సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ అధ్యక్షుడిగా పోటీ చేశారు. బిఆర్టియును ఓడించాలన్న లక్ష్యంతో సిఐటియు, ఐ ఎన్ టి యు సి యూనియన్లు కూటమిగా పోటీ చేసిన వారికి పరాజయం తప్పలేదు. ఈ సందర్భంగా పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. 40 సంవత్సరాలుగా పటాన్చెరు నియోజకవర్గంలోని కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేయడంతో పాటు, వారి కష్టసుఖాల్లో అండగా నిలిచామని తెలిపారు. గత పదిలుగా ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కార్మికులకు తగు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని తెలిపారు. వరుసగా రెండుసార్లు బి ఆర్ టి యు యూనియన్ ను గెలిపించిన పెన్నార్ కార్మికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని ఆయన తెలిపారు. బి ఆర్ టి యు రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో పెన్నార్ పరిశ్రమలో వరుసగా రెండోసారి బిఆర్టియు యూనియన్ ఘన విజయం సాధించడం జరిగిందని తెలిపారు. యూనియన్ విజయానికి సహకరించిన ప్రతి కార్మికుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

2 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

2 weeks ago