పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ ప్రజల ఆత్మ ప్రతీక బీఆర్ఎస్ పార్టీ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని.. పటాన్చెరు డివిజన్ పరిధిలోని అంబేద్కర్ విగ్రహ సమీపంలో బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ..ఒక్కడితో మొదలైన బి ఆర్ ఎస్ ప్రస్థానం, ఉదృతమై ఉప్పెనగా మారి స్వరాష్ట్ర కలను సాకారం చేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నాయకత్వంలో పోరాడి సాధించుకున్న తెలంగాణను.. దశాబ్ది కాలంలో దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత బిఆర్ఎస్ కి దక్కిందన్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని కార్యకర్తల సభ్యత్వం బి ఆర్ ఎస్ కు ఉందన్నారు. ప్రతి కార్యకర్త కు 2 లక్షల రూపాయల రూపాయల ఉచిత ప్రమాద భీమా అందించడంతో పాటు, కష్టసుఖాల్లో అందగా ఉంటున్నామని తెలిపారు.కాంగ్రెస్ పాలనలో రైతులు, అన్నివర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. నేడు మరోసారి ప్రజల పక్షాన ప్రజా ఉద్యమం చేసేందుకు బిఆర్ఎస్ పార్టీ సంసిద్ధమైందన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…