Telangana

మహిళల సాంస్కృతిక ప్రతిభకు బీఆర్‌ఎస్ పెద్దపీట

భారతి నగర్ డివిజన్‌లో ఘనంగా రంగోలి పోటీలు

పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేసిన కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

రామచంద్రాపురం ,మనవార్తలు ప్రతినిధి :

భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ ఎం.ఐ.జి కాలనీలో ఉన్న బీ పార్క్ మరియు వివేకానంద పార్క్ లలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన రంగోలి పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలను భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి గారు ఏర్పాటు చేయగా, ఆమె ముఖ్య అతిథిగా హాజరై మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారు మాట్లాడుతూ మహిళల సాంస్కృతిక సంప్రదాయాలు, కళా నైపుణ్యాలను ప్రోత్సహించడంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందుకు రావాలనే లక్ష్యంతో పార్టీ నాయకత్వం నిరంతరం పనిచేస్తోందని అన్నారు. మహిళల ఐక్యత, సాంస్కృతిక విలువలను కాపాడే కార్యక్రమాలకు బీఆర్‌ఎస్ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

రంగోలి పోటీల్లో పాల్గొన్న మహిళలు తమ కళా ప్రతిభతో ఆకట్టుకున్నారు. రంగుల సమన్వయం, సంప్రదాయ నమూనాలు, సందేశాత్మక చిత్రాలతో పార్కులు కళాకాంతులతో మెరిసాయి. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారు ప్రత్యేక బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మహిళా సర్కిల్ అధ్యక్షురాలు శ్రీమతి రాణి యాదవ్,రామస్వామి, మాజీ కౌన్సిలర్ నాగమణి, మహిళా బీఆర్‌ఎస్ నాయకులు స్వర్నలత, లక్ష్మి, అనిత, ఫాతిమా, రాధ, సునీత, బేబీ, అరుణ జ్యోతి, పద్మ, విజయలక్ష్మి, నస్రీన్, గాయత్రి, విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

7 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

7 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

7 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

3 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

3 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

3 days ago