Telangana

మహిళల సాంస్కృతిక ప్రతిభకు బీఆర్‌ఎస్ పెద్దపీట

భారతి నగర్ డివిజన్‌లో ఘనంగా రంగోలి పోటీలు

పాల్గొన్న మహిళలకు బహుమతులు అందజేసిన కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

రామచంద్రాపురం ,మనవార్తలు ప్రతినిధి :

భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ ఎం.ఐ.జి కాలనీలో ఉన్న బీ పార్క్ మరియు వివేకానంద పార్క్ లలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన రంగోలి పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలను భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సింధు ఆదర్శ్ రెడ్డి గారు ఏర్పాటు చేయగా, ఆమె ముఖ్య అతిథిగా హాజరై మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారు మాట్లాడుతూ మహిళల సాంస్కృతిక సంప్రదాయాలు, కళా నైపుణ్యాలను ప్రోత్సహించడంలో బీఆర్‌ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ముందుకు రావాలనే లక్ష్యంతో పార్టీ నాయకత్వం నిరంతరం పనిచేస్తోందని అన్నారు. మహిళల ఐక్యత, సాంస్కృతిక విలువలను కాపాడే కార్యక్రమాలకు బీఆర్‌ఎస్ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.

రంగోలి పోటీల్లో పాల్గొన్న మహిళలు తమ కళా ప్రతిభతో ఆకట్టుకున్నారు. రంగుల సమన్వయం, సంప్రదాయ నమూనాలు, సందేశాత్మక చిత్రాలతో పార్కులు కళాకాంతులతో మెరిసాయి. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విజేతలకు కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి గారు ప్రత్యేక బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మహిళా సర్కిల్ అధ్యక్షురాలు శ్రీమతి రాణి యాదవ్,రామస్వామి, మాజీ కౌన్సిలర్ నాగమణి, మహిళా బీఆర్‌ఎస్ నాయకులు స్వర్నలత, లక్ష్మి, అనిత, ఫాతిమా, రాధ, సునీత, బేబీ, అరుణ జ్యోతి, పద్మ, విజయలక్ష్మి, నస్రీన్, గాయత్రి, విజయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

16 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

17 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago