_’హవానా’ ప్రారంభోత్సవంలో పిలుపునిచ్చిన బీఎస్ఎన్ఎన్ జీఎం రాజేశ్వరి
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
టెలి కమ్యూనికేషన్స్ రంగంలో 5జీ సాంకేతికతను అమలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో స్టార్ట్ ప్ లను భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని వర్ధమాన ఇంజనీర్లకు సంగారెడ్డిలోని భారతీయ పంచార విగం (బీఎస్ఎన్ఎల్) ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ డి.రాజరాజేశ్వరి పిలుపునిచ్చారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం అధ్వర్యంలో ‘హవానా’ పేరిట నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సాంకేతికోత్సవాన్ని గురువారం జ్యోతి ప్రజ్వలనతో ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ లో తన ఇరవై ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం, అందులో సాంకేతిక పరిజ్ఞానం ఎదిగిన తీరును రాజేశ్వరి వివరించారు. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేది ఇంజనీర్లని ఎట్ ఏఐ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి గంగాధర్ గుడే అన్నారు. మనదేశం నుంచి వస్తున్న ఆవిష్కరణలు, వ్యవస్థాపకరను ఆయన బహుదా ప్రశంసించారు. ఈ రెండు రోజుల సాంకేతికోత్సవం విద్యార్థులలో మరిన్ని ఆలోచలను, సృజనాత్మకతను ప్రేరేపిస్తుందన్న విశ్వాసం వ్యక్తపరిచారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…