ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సహకారంతో నిర్వహణ
140 మంది రక్తదానం
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో బుధవారం (31-12-2025న) రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ సెంటర్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎన్ఎస్ఎస్ అధ్యాపక, విద్యార్థి సమన్వయకర్తలతో కలిసి, గీతం హైదరాబాదు రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ ఈ శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దాదాపు 140 మంది విద్యార్థి స్వచ్ఛంద సేవకులు ఈ శిబిరంలో ఉత్సాహంగా పాల్గొని, రక్తదానం చేశారు. దాతలకు ఎన్టీఆర్ ట్రస్టు ప్రశంసా పత్రాలను ప్రదానం చేయడంతో పాటు రిఫ్రెష్ మెంట్లను కూడా అందజేసింది.ఇటువంటి నిస్వార్థ చర్యలు ప్రాణాలను కాపాడటమే కాకుండా ఇతరులు ముందుకొచ్చి సమాజ హితానికి దోహదపడేలా ప్రేరేపిస్తాయని నిర్వాహకులు విద్యార్థుల దాతృత్వాన్ని ప్రశంసించారు. రక్తదానం నిజంగా ప్రాణదానం వంటిదని, ఇది వ్యక్తులను, సమాజాన్ని బలోపేతం చేసే ఒక నిస్వార్థమైన చర్యగా వారు అభివర్ణించారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…