Telangana

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు పూర్వ వైభ‌వం తీసుకువ‌చ్చేందుకు త‌మ‌వంతు కృషి చేస్తాం – బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,తెల్లాపూర్

_ విద్యా భారతి పాఠశాలలో అద‌న‌పు త‌ర‌గ‌తి గ‌ది నిర్మాణం కోసం ఐదు ల‌క్ష‌ల విరాళం అందించిన గ‌డీల శ్రీకాంత్ గౌడ్

ప్రభుత్వ పాఠశాలల‌ను ప్రైవేటు స్కూళ్ళ‌కు ధీటుగా తీర్చిదిద్దేందుకు త‌మ వంతు కృషి చేస్తాన‌ని పటాన్ చెరు మాజీ జెడ్పిటిసి, బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వసతుల కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆయ‌న తెలిపారు .సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ, నాగులపల్లి గ్రామంలో విద్యా భారతి పాఠశాలను గ‌తంలో ఆయ‌న ప‌రిశీలించారు. పాఠ‌శాల‌లో అద‌న‌పు త‌ర‌గ‌తి గ‌ది నిర్మాణం కోసం గడిల శ్రీకాంత్ గౌడ్ ఐదు ల‌క్ష‌ల విరాళం ప్ర‌క‌టించారు.తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను అభివృద్ది చేస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమిత‌మైంద‌ని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ విమ‌ర్శించారు.

ఇటీవ‌ల తాను పటాన్ చెరువు మండల పరిధిలోని ముత్తంగి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాన‌ని  అక్క‌డ క‌నీస‌వ‌స‌తులు క‌రువ‌య్యాయ‌ని తెలిపారు. ప్ర‌భుత్వం పేరుకే మన ఊరు, మన బడి కార్యక్రమం అంటూ గొప్ప‌లు చెబుతుంద‌ని క్షేత్ర స్థాయిలో మాత్రం ఎలాంటి ప‌నులు చేప‌ట్ట‌లేద‌న్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌భుత్వం పాఠ‌శాల‌లు శిథిలావ‌స్థ‌కు చేరుకున్నాయ‌ని క‌నీస మౌళిక స‌దుపాయాలు క‌ల్పించ‌లేద‌న్నారు.పాఠశాలలు ప్రారంభం అయ్యి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు విద్యార్థుల‌కు పుస్తకాలు అందించ‌లేద‌న్నారు. దీనిని బట్టి విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలుస్తుందన్నారు. డిజిటల్ పాఠాలు కేవలం డిజిటల్ ప్రకటనలకే పరిమితం అయ్యాయ‌ని విమ‌ర్శించారు. ప్ర‌భుత్వ పాఠశాలలో దాతల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ మున్సిపల్ అధ్యక్షుడు శంకర్ ,తెల్లాపూర్ కౌన్సిలర్ శంషాబాద్ రాజు ,జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ మహేందర్, పటాన్ చెరు మండల్ అధ్యక్షుడు ఈశ్వరయ్య, ఓబిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవేందర్ గౌడ్, ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రముఖ హనుమంతరావు ,మాజీ బీజేవైఎం జిల్లా నాయకులు రాంబాబు, పటాన్చెరు మండల్ ఓ బి సి అధ్యక్షుడు నరేందర్ గౌడ్, ఇతర బిజెపి నాయకులు పాల్గొన్నారు.

admin

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

11 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago