Telangana

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పై దాడి ఖండించిన బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,ప‌టాన్ చెరు:

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పై జ‌రిగిన దాడిని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న ఆద‌ర‌ణ త‌ట్టుకోలేకే టీఆర్ఎస్ నేత‌లు దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు . జ‌నగాంలో జిల్లా దేవరుప్పుల లో తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో టిఆర్ఎస్ గుండాలు బిజెపి నాయకులు కార్యకర్తలపై చేసిన రాళ్ల దాడికి నిరసనగా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ చౌరస్తాలో ఎర్రబెల్లి దయాకర్ రావు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు . స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా కూడా బడుగు బలహీన వర్గాల పై టిఆర్ఎస్ దొరల అహంకారం అణచివేతకు నిదర్శనం ఈ రాళ్ల దాడి అని ఆయన మండిపడ్డారు. బండి సంజయ్, బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డిన వారిని వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు . బిజెపి నాయకుల పై కార్యకర్తల పై రాళ్ల దాడి చేసి వారి వాహనాలను ధ్వంసం చేయ‌డం సిగ్గుచేట‌ని తెలిపారు . భవిష్యత్తులో ఇలాంటి దాడులు చేస్తే సహించేది లేదని దాడికి ప్రతిదాడి తప్పదని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పటాన్ చేరు బిజెపి మండల అధ్యక్షుడు ఎల్వర్తి ఈశ్వరయ్య, బిజెపి సీనియర్ నాయకుడు జనార్దన్ రెడ్డి, ఇస్నాపూర్ వార్డు సభ్యులు నారాయణదాసు, బిజెపి మహిళా నాయకురాలు గడ్డ పుణ్యవతి, మండల బిజెపి ఉపాధ్యక్షుడు సాయి కుమార్,బిజేవైయం మండల ప్రధాన కార్యదర్శి దిపక్ గౌడ్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు జోగు ధన్ రాజ్ మరియు యస్.ఆర్.కే యువసేన సభ్యులు కిశోర్ రెడ్డి,సర్వోత్తం రెడ్డి, రాజ్ గోపాల్, విజయ్,శకిల్, దుర్గా సాయి, రాము, మల్కాపురం సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

14 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

14 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

14 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

1 day ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

1 day ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

3 days ago