Telangana

విద్యార్థులకు స్కూలు బ్యాగ్ లను పంపిణీ చేసిన_ బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ‌డీల‌ శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,పటాన్ చెరు:

ప్ర‌భుత్వ పాఠ‌శాల విద్యార్థులు కార్పోరేట్ పాఠ‌శాల‌కు ధీటుగా పోటీ ప‌డి చ‌ద‌వి మంచి ఫ‌లితాలు సాధించాల‌ని బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ‌డీల‌ శ్రీకాంత్ గౌడ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గం చిట్కూల్ గ్రామంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో జ‌రిగే ఉపాధ్యాయ దినోత్స‌వ వేడుక‌ల్లో ఆయ‌న పాల్గొన్నారు .డాక్ట‌ర్ స‌ర్వేప‌ల్లి రాధాకృష్ణ జ‌యంతి సంద‌ర్భంగా ప్ర‌తి ఏటా సెప్టెంబ‌ర్ ఐదవ తేదీన టీచ‌ర్స్ డే జ‌రుపుకుంటున్నామ‌న్నారు .గురువును దైవంగా పూజించే సాంప్ర‌దాయ‌మం మ‌నద‌ని ఆయ‌న గుర్తు చేశారు .

టీచ‌ర్స్ డేను పురస్క‌రించుకుని చిట్కూల్ హైస్కూల్ లోని 24 మంది ఉపాధ్యాయుల‌ను, వ‌డ్డెర కాల‌నీ ప్రైమ‌రీ స్కూల్ లోని 12 మంది ఉపాధ్యాయుల‌ను బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ‌డీల‌ శ్రీకాంత్ గౌడ్ స‌న్మానించారు. అలాగే పాఠ‌శాల‌లో చ‌దువుతున్న 300 మంది విద్యార్థుల‌కు గ‌డిల ఫౌండేష‌న్ ద్వారా స్కూల్ బ్యాగుల‌ను పంపిణీ చేశారు . ప‌టాన్ చెరు నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి పేద విద్యార్థుల విద్యుకు సంబంధించి అన్ని ర‌కాల సాయం అందించేందుకు తాను ముందుంటాన‌ని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల బిజెపి అధ్యక్షుడు ఎల్వర్తి ఈశ్వరయ్య, బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవేందర్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు బాబు రాజ్ గౌడ్, జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు మదుకర్ రెడ్డి, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు గడ్డ పుణ్యవతి, మహిళా నాయకురాలు జాన్సీ, మరియు యస్.ఆర్.కే యువసేన సభ్యులు కిషోర్ రెడ్డి, ధన్ రాజ్, సాయి కుమార్,శకిల్, దుర్గా సాయి, దస్తగిరి, జ్ఞానేశ్వర్, రవితేజ, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

15 hours ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

15 hours ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

15 hours ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

1 day ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

1 day ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

3 days ago