Telangana

స్మార్ట్ సిటీలదే భవిష్యత్తు: బెంగళూరు ఎయిర్ పోర్ట్ సిటీ సీఈవో రావు మునుకుట్ల

 

మనవార్తలు ,పటాన్ చెరు:

ప్రపంచ భవిష్యత్తును , నగరాల భవిష్యత్తును వేరుచేయడం కష్టమని , ప్రపంచ జనాభాలో సగానికి పైగా నగరాలు 80 శాతం స్థూల జాతీయోత్పత్తిని ( జీడీపీ ) అందిస్తున్నాయని బెంగళూరు ఎయిర్పోర్ట్ సిటీ లిమిటెడ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ( సీఈవో ) రావు మునుకుట్ల చెప్పారు . హైదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో సోమవారం ఆయన ‘ స్మార్ట్ సిటీస్ – ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ అప్లికేషన్స్ ‘ ( బెంగళూరు ఎయిర్పోర్ట్ సిటీ – ఓ అధ్యయనం ) అనే అంశంపై ఆయన ప్రసంగించారు . ‘ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని , గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సివిల్ ఇంజనీరింగ్ విభాగం అధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ , స్మార్ట్ సిటీల రంగంలో తనకున్న విశేష అనుభవం , నెపుణ్యాలను విద్యార్థులతో పంచుకున్నారు . ప్రపంచ జనాభాలో దాదాపు 70 శాతం మంది 2050 నాటికి పట్టణాలలోనే నివసిస్తారని , 90 శాతం ఆర్థిక కార్యకలాపాలు అక్కడే జరుగుతాయని జోస్యం చెప్పారు . ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం 2030 నాటికి మెగాసిటీలలో నివసించే వారి సంఖ్య 35 శాతం పెరుగుతుందని , అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలోనే ఇది ఎక్కువగా జరుగుతుందన్నారు .

ఓ అంచనా ప్రకారం , 2017 లో ఒక్క అమెరికాలోనే ట్రాఫిక్ – సంబంధిత రద్దీ ఖర్చులు 300 బిలియన్ల డాలర్లను అధిగమించినట్టు ఆయన చెప్పారు . పట్టణీకరణ మార్కెట్ వృద్ధిని నడిపించే స్మార్ట్ టెక్నాలజీ చొరవలను కోరుతోందని , ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో వేగవంతమైన పట్టణీకరణ జరుగుతోందన్నారు . నగరాల పెరుగుదల సంబంధం ఉందని ఆయన పేర్కొన్నారు . ఆర్థికాభివృద్ధికి అవినాభావ – ప్రపంచం పట్టణీకరణ దిశగా పయనిస్తోందని , పెరుగుతున్న పట్టణీకరణ , మౌలిక సదుపాయాలు , ఆస్తుల నిర్వహణ ఆవశ్యకత ప్రపంచ దేశాలను స్మార్ట్ సిటీల ఏర్పాటు దిశగా పురిగొల్పుతున్నాయని రావు చెప్పారు . స్మార్ట్ సిటీ పునాదులు , స్మార్ట్ ఆర్కిటెక్చర్ , సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు , పౌరుల దృక్పథం వంటి అంశాలను ఆయన విశదీకరించారు .

బెంగళూరు ఎయిర్పోర్ట్ సిటీ ప్రాజెక్టుతో పాటు స్టార్టప్లు , పరిశోధనలు చేపట్టడానికి ఉన్న అవకాశాలను వివరించారు . ప్రపంచ నడవడికి అనుగుణంగా విద్యా సంస్థల్లోని విద్యార్థుల మధ్య అంతర్ – విభాగ పరిశోధనలు , సంబంధిత కార్యకలాపాల ఆవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు . సమస్య పరిష్కారానికి దారితీస్తుందని , సమాజానికి ఇతోధిక ప్రయోజనాలను స్వచ్ఛందంగా అందించాలని రావు పిలుపునిచ్చారు . విద్యార్థులు సంధించిన పలు ప్రశ్నలకు ఆయన ఆకట్టుకునేలా జవాబులిచ్చి వారిని ఉత్సాహపరిచారు . తొలుత , సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ శివరామ కృష్ణప్రసాద్ బెల్లం అతిథిని సత్కరించారు . ఈ కార్యక్రమంలో సీఎస్ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.ఫణికుమార్ , ప్రొఫెసర్ పి.ఈశ్వరయ్య , ప్రొఫెసర్ పి.త్రినాథరావు , డాక్టర్ జి.జ్యోతికుమారి తదితరులు పాల్గొన్నారు .

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago