పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
ప్రధాని నరేంద్ర మోడీ పేదలకు మరో ఏడాది నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ ప్రకటనపై పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ,బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.
పటాన్ చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ లోని తన కార్యాలయంలో ప్రధాని మోడీ చిత్రపటానికి పాలభిషేకం చేశారు.కరోనా సమయంలో గత రెండు సంవత్సరాలుగా ఉచితంగా ఇస్తున్న రేషన్ సరుకులనుమరో ఏడాది పొడగించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కిసాన్ మోర్చా నాయకులు దేవేందర్ గౌడ్ , వీరారెడ్డి,పటాన్ చెరు మండల బీజేపీ ఉపాధ్యక్షులు సాయికుమార్, జోగు ధన్ రాజ్, ఎస్ఆర్కే యువసేన సభ్యులు మచ్చ కిషోర్ రెడ్డి ,దుర్గా సాయి, సాయి కుమార్ , బండి నర్సింగ్ యాదవ్ , తదితరులు పాల్గొన్నారు .
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…