మనవార్తలు , శేరిలింగంపల్లి :
బీజేపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హాఫీజ్ పెట్ డివిజన్ లో గల ఆల్విన్ కాలని లోని తన ఇంట్లోని తన గదిలోకి వెళ్లి నన్ను డిష్ట్రబ్ చేయొద్దు పడుకుంటానని చెప్పాడు. కొద్దిసేపటి టిఫిన్ తీసుకెళ్లిన పి ఏ సురేష్ డోర్ కొట్టగా తీయకపోవడంతో కుటుంబ సభ్యుల సాయంతో కిటికీలోంచి చూడగా సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకుని కన్పించడంతో డోర్ బద్దలు కొట్టి కిందకు దింపన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మదీనా గూడలోని శ్రీకర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, స్నేహితులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకొన్నారు.
చిన్నప్పటి నుండి ఆర్ ఎస్ ఎస్, ఏబీవీపీ వంటి సంస్థల్లో పనిచేసి, అంచెలంచెలుగా ఎదిగి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా ఉన్నాడు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మంచి గుర్తింపు చెందిన వ్యక్తిగా అందరి మన్ననలు పొందారు. కరోనా విపత్తు సమయంలో వెలాది మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసి అందరి మన్ననలు పొందారు.ఎవరు ఏ సమయంలో ఫోన్ చేసినా వెళ్లి వారి సమస్యలు తెలుసుకునేవారు.పేదల పక్షాన పోరాడే వ్యక్తి అకాల మరణం పట్ల శేరిలింగంపల్లి నియోజకవర్గo ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…