Telangana

బీజేపీ నేత ఉరి వేసుకొని ఆత్మహత్య

మనవార్తలు , శేరిలింగంపల్లి :

బీజేపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హాఫీజ్ పెట్ డివిజన్ లో గల ఆల్విన్ కాలని లోని తన ఇంట్లోని తన గదిలోకి వెళ్లి నన్ను డిష్ట్రబ్ చేయొద్దు పడుకుంటానని చెప్పాడు. కొద్దిసేపటి టిఫిన్ తీసుకెళ్లిన పి ఏ సురేష్ డోర్ కొట్టగా తీయకపోవడంతో కుటుంబ సభ్యుల సాయంతో కిటికీలోంచి చూడగా సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకుని కన్పించడంతో డోర్ బద్దలు కొట్టి కిందకు దింపన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మదీనా గూడలోని శ్రీకర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆయన మృతి విషయం తెలుసుకున్న బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, స్నేహితులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకొన్నారు.

చిన్నప్పటి నుండి ఆర్ ఎస్ ఎస్, ఏబీవీపీ వంటి సంస్థల్లో పనిచేసి, అంచెలంచెలుగా ఎదిగి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా ఉన్నాడు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో మంచి గుర్తింపు చెందిన వ్యక్తిగా అందరి మన్ననలు పొందారు. కరోనా విపత్తు సమయంలో వెలాది మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసి అందరి మన్ననలు పొందారు.ఎవరు ఏ సమయంలో ఫోన్ చేసినా వెళ్లి వారి సమస్యలు తెలుసుకునేవారు.పేదల పక్షాన పోరాడే వ్యక్తి అకాల మరణం పట్ల శేరిలింగంపల్లి నియోజకవర్గo ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago