Telangana

బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర ఘనంగా నిర్వహించాలి :ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయండి

_ప్రత్యేక బస్సుల ఏర్పాట్లు..

_భక్తుల సంఖ్యకు అనుగుణంగా క్యూలైన్లు

అమీన్పూర్,మనవార్తలు ప్రతినిధి :

మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ప్రముఖ శైవ క్షేత్రమైన బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం జాతర మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.జాతర ఏర్పాట్లపై బుధవారం ఆలయ ఆవరణలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యంత పురాతన శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి మహాశివరాత్రి జాతర మహోత్సవాల విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.16వ తేదీ లోపు అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

భక్తుల సంఖ్యకు అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు.స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు, చలువ పందిళ్ళు, తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు.అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 24 గంటల పాటు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.గత సంవత్సరం ఐదు లక్షల మంది భక్తులు జాతర ఉత్సవాలకు హాజరయ్యారని, ఈసారి మరింత భక్తుల సంఖ్య పెరగవచ్చని అన్నారు.ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం అందించే నిధులతో పాటు దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, అమీన్పూర్ ఎంపీపీ దేవానందం, జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, దేవాలయ కమిటీ చైర్మన్ తులసి రెడ్డి, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, ఆలయ ఈవో శశిధర్, మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, టిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు, పుర ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago