మాటల్లో కాదు చేతల్లో చూపిన నాయకుడు రేవంత్ రెడ్డి
తెలంగాణలో పెరగనున్న బీసీల రాజకీయ అవకాశాలు
బీసీ లోకమంతా కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ రెడ్డి కి రుణపడి ఉంటాం
ముఖ్యమంత్రి ని కలిసి ధన్యవాదాలు తెలిపిన నీలం మధు ముదిరాజ్
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
దేశంలో ఎక్కడ లేని విధంగా జనాభా ప్రాతిపదికన బీసీ వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేసిన బీసీ కులగణన చారిత్రాత్మకమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. గురువారం హైదరాబాద్ జుబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో నీలం మధు సీఎంను కలిసి పుష్పగుచ్ఛం అందించి తెలంగాణలోని బీసీల పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ దశాబ్దాలుగా బీసీలలో రాజకీయ చైతన్యం ఉన్నా రాజకీయ ప్రాతినిధ్యం అవకాశం లేక చాలామంది బీసీలు నాయకులుగా ఎదగలేకపోయారని కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బృహత్ సంకల్పంతో కులగణన ని చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీసీ వర్గాలకు కులగణన పట్ల ఇచ్చిన హామీని తెలంగాణ ప్రజా ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు. ప్రజలకు సంక్షేమం అభివృద్ది సామాజిక న్యాయం మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్న దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి అని కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంతో రానున్న రోజుల్లో బీసీ బిడ్డలంతా రాజకీయంగా ఎదగడానికి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచే దిశగా అసెంబ్లీలో నిర్ణయం తీసుకోవడం పట్ల కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర మంత్రులు అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తూ బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజా ప్రభుత్వానికి తెలంగాణ బీసీలమంతా రుణపడి ఉంటామన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…