బస్తీలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి బస్తి దర్శన్ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని రామచంద్రాపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ అన్నారు.
బస్తి దర్శన్ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం డివిజన్ కనుకుంట ఫేస్ 1(గండమ్మా గుడి ముందు) ఉన్న కాలనీ లో అక్కడ ఉన్న సమస్యల GHMC అధికారుల దృష్టికి రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ తీసుకెళ్లారు.
ముఖ్యంగా వర్షం పడ్డప్పుడు రోడ్ల మీద నీరు నిలుస్తుందని,డ్రైనేజీ సమస్య,సి సి రోడ్,ఫాదర్ స్కూల్ పక్కన ఉన్న పాత నాలా డిసైల్టింగ్ మరియు ఎక్సపన్షన్ చేయుట, లారీల పార్కింగ్,డ్రైనేజీ వంటి సమస్యలు ఉన్నాయి అని పర్యటనలో కార్పొరేటర్ కుబస్తి వాసులు తెలిపారు. అలాగే కైలాష్ నగర్ కాలనీ పోచమ్మ గుడి వద్ద ట్రాన్స్ఫార్మర్ మార్చట విషయంపై కాలనీ వాసులు తమ దృష్టికి తీసుకువచ్చారని ఆమె తెలిపారు. బస్తి దర్శన్ లో తమ దృష్టికి వచ్చిన పనులు అన్ని సంబంధిత అధికారులతో చర్చించి వెంటనే పరిష్కరిస్తాం అని కార్పొరేటర్ కాలనీ వాసులకు హామి ఇచ్చారు . బస్తీ దర్శన్ కార్యక్రమంలో నర్సింహా రెడ్డి,యది రెడ్డి,రామకృష్ణ,సత్తి రెడ్డి,కుమార స్వామి,AE ప్రభు,SFA సంపత్,కాలనీ వాసులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు…
మనవార్తలు ప్రతినిధి , అమీన్పూర్ : అమీన్పూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పడిన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ…