-భూమి పూజ లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్.
-కోటి 35 లక్షల రూపాయల వ్యయంతో ఆలయ నిర్మాణం
అమీన్పూర్ ,మనవార్తలు ప్రతినిధి :
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం గుట్ట పైన ఒక కోటి 35 లక్షల రూపాయల అంచనా వ్యయంతో అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించబోతున్నట్లు పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు, అయ్యప్ప భక్తుల సమక్షంలో వేద పండితుల వేద మంత్రోచ్ఛరణల మధ్య ఎమ్మెల్యే జిఎంఆర్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ప్రజలలో భక్తి భావం పెంపొందించడంలో నూతన దేవాలయాల నిర్మాణాలు ఎంతగానో ఉపకరిస్తాయని తెలిపారు. అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంగా సొంత నిధులతో 200 కు పైగా దేవాలయాలు నిర్మించడం జరిగిందని తెలిపారు. అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణానికి భక్తులందరూ విరివిగా విరాళాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…