గీతంలో మొక్కలు నాటిన డీఎస్పీ, సీఐ
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
పర్యావరణ స్పృహను పెంపొందించడంతో పాటు మాదకద్రవ్యాల దుర్వినియోగ ప్రమాదాల గురించి అవగాహన పెంచడంలో భాగంగా పటాన్ చెరు పోలీసు విభాగం సోమవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు.డీఎస్పీ ఎస్. ప్రభాకర్, పటాన్ చెరు సర్కిల్ ఇన్ స్పెక్టర్ వినాయకరెడ్డిల నేతృత్వంలో, దాదాపు 30 మంది పోలీసు సిబ్బంది గీతం ప్రాంగణంలో మొక్కలు నాటారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, మాదకద్రవ్య రహిత సమాజాన్ని సూచిస్తూ రాష్ట్ర హరితీకరణకు దోహదపడటం లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది.ఈ సందర్భంగా డీఎస్పీ ప్రభాకర్ మాట్లాడుతూ, మాదకద్రవ్య దుర్వినియోగం యొక్క తీవ్రమైన పరిణామాలను ప్రస్తావిస్తూ, మాదకద్రవ్య, సైకోట్రోపిక్ పదార్థాల హానికరమైన ప్రభావాలను వివరించారు. విద్యార్థులు, యువత అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా ఉండాలని, మాదకద్రవ్య రహిత దేశాన్ని నిర్మించడానికి కట్టుబడి ఉంటాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గీతం నాయకత్వం కూడా చురుకుగా పాల్గొంది. గీతం, హైదరాబాదు రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఈఈసీఈ విభాగం అధ్యాపకులు ప్రొఫెసర్ కె.మంజునాథాచారి, ప్రొఫెసర్ పి.త్రినాథరావు; ఎస్టేట్ అధికారి డీవీఏ మోహన్ తదితరులు ఉన్నారు.పర్యావరణ, సామాజిక సమస్యలను పరిష్కరించడంలో చట్ట అమలు సంస్థలు, విద్యా సంస్థలు, సమాజం మధ్య భాగస్వామ్య బాధ్యతగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…