Telangana

మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో భాగంగా

గీతంలో మొక్కలు నాటిన డీఎస్పీ, సీఐ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పర్యావరణ స్పృహను పెంపొందించడంతో పాటు మాదకద్రవ్యాల దుర్వినియోగ ప్రమాదాల గురించి అవగాహన పెంచడంలో భాగంగా పటాన్ చెరు పోలీసు విభాగం సోమవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు.డీఎస్పీ ఎస్. ప్రభాకర్, పటాన్ చెరు సర్కిల్ ఇన్ స్పెక్టర్ వినాయకరెడ్డిల నేతృత్వంలో, దాదాపు 30 మంది పోలీసు సిబ్బంది గీతం ప్రాంగణంలో మొక్కలు నాటారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, మాదకద్రవ్య రహిత సమాజాన్ని సూచిస్తూ రాష్ట్ర హరితీకరణకు దోహదపడటం లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది.ఈ సందర్భంగా డీఎస్పీ ప్రభాకర్ మాట్లాడుతూ, మాదకద్రవ్య దుర్వినియోగం యొక్క తీవ్రమైన పరిణామాలను ప్రస్తావిస్తూ, మాదకద్రవ్య, సైకోట్రోపిక్ పదార్థాల హానికరమైన ప్రభావాలను వివరించారు. విద్యార్థులు, యువత అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా ఉండాలని, మాదకద్రవ్య రహిత దేశాన్ని నిర్మించడానికి కట్టుబడి ఉంటాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గీతం నాయకత్వం కూడా చురుకుగా పాల్గొంది. గీతం, హైదరాబాదు రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఈఈసీఈ విభాగం అధ్యాపకులు ప్రొఫెసర్ కె.మంజునాథాచారి, ప్రొఫెసర్ పి.త్రినాథరావు; ఎస్టేట్ అధికారి డీవీఏ మోహన్ తదితరులు ఉన్నారు.పర్యావరణ, సామాజిక సమస్యలను పరిష్కరించడంలో చట్ట అమలు సంస్థలు, విద్యా సంస్థలు, సమాజం మధ్య భాగస్వామ్య బాధ్యతగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago