Telangana

మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో భాగంగా

గీతంలో మొక్కలు నాటిన డీఎస్పీ, సీఐ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పర్యావరణ స్పృహను పెంపొందించడంతో పాటు మాదకద్రవ్యాల దుర్వినియోగ ప్రమాదాల గురించి అవగాహన పెంచడంలో భాగంగా పటాన్ చెరు పోలీసు విభాగం సోమవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు.డీఎస్పీ ఎస్. ప్రభాకర్, పటాన్ చెరు సర్కిల్ ఇన్ స్పెక్టర్ వినాయకరెడ్డిల నేతృత్వంలో, దాదాపు 30 మంది పోలీసు సిబ్బంది గీతం ప్రాంగణంలో మొక్కలు నాటారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, మాదకద్రవ్య రహిత సమాజాన్ని సూచిస్తూ రాష్ట్ర హరితీకరణకు దోహదపడటం లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది.ఈ సందర్భంగా డీఎస్పీ ప్రభాకర్ మాట్లాడుతూ, మాదకద్రవ్య దుర్వినియోగం యొక్క తీవ్రమైన పరిణామాలను ప్రస్తావిస్తూ, మాదకద్రవ్య, సైకోట్రోపిక్ పదార్థాల హానికరమైన ప్రభావాలను వివరించారు. విద్యార్థులు, యువత అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా ఉండాలని, మాదకద్రవ్య రహిత దేశాన్ని నిర్మించడానికి కట్టుబడి ఉంటాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గీతం నాయకత్వం కూడా చురుకుగా పాల్గొంది. గీతం, హైదరాబాదు రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఈఈసీఈ విభాగం అధ్యాపకులు ప్రొఫెసర్ కె.మంజునాథాచారి, ప్రొఫెసర్ పి.త్రినాథరావు; ఎస్టేట్ అధికారి డీవీఏ మోహన్ తదితరులు ఉన్నారు.పర్యావరణ, సామాజిక సమస్యలను పరిష్కరించడంలో చట్ట అమలు సంస్థలు, విద్యా సంస్థలు, సమాజం మధ్య భాగస్వామ్య బాధ్యతగా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

10 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

11 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago