Telangana

కృత్రిమ మేధస్సుతో కలుపుతీసే యంత్రం

స్వయంప్రతిపత్తి రోబోట్ ను ఆవిష్కరించిన

గీతం బీటెక్ చివరి ఏడాది విద్యార్థిని అమూల్య

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఆధునిక వ్యవసాయాన్ని విప్లవాత్మకంగా మార్చడానికి రూపొందించిన కృత్రిమ మేధస్సు (ఏఐ)తో కూడిన స్వయంప్రతిపత్తి కలుపు తీసే రోబోట్ ను గీతం బీటెక్ చివరి ఏడాది విద్యార్థి సి.అమూల్య, ఆమె బృంద సభ్యులు అభివృద్ధి చేశారు. స్మార్ట్ ఫార్మింగ్ కోసం ఏఐ-శక్తితో కూడిన స్వయంప్రతిపత్తి కలుపు తీసే రోబోట్ అనే వారి క్యాప్ స్టోన్ (ముగింపు) ప్రాజెక్టులో భాగంగా, ఈ బృందం పంటలకు హాని కలిగించకుండా కలుపు మొక్కలను గుర్తించి తొలగించగల రోబోటిక్ పరిష్కారాన్ని రూపొందించింది. ఈ అత్యాధునిక వ్యవస్థ హానికరమైన కలుపు మందులపై ఆధారపడటాన్ని తగ్గించడమే కాకుండా మానవీయ శ్రమను గణనీయంగా తగ్గించి, పర్యావరణ స్పృహతో కూడిన వ్యవసాయ పద్ధతులను సూచిస్తోంది.టెన్సార్ ఫ్లో లైట్ ద్వారా అమలుచేసి, రాస్ బెర్రీ పై4లో అనుసంధానించిన తేలికైన సీఎన్ఎన్ మోడల్ ను ఉపయోగించి కలుపు మొక్కలను గుర్తించి తొలగించే స్వయంప్రతిపత్తి రోబోట్ ను తమ బృందం అభివృద్ధి చేసినట్టు అమూల్య వివరించారు. జీపీఐవో ద్వారా వాస్తవ-సమయ ప్లాంట్ వర్గీకరణ, మోటార్ నియంత్రణను తమ వ్యవస్థ నిర్వహిస్తుందన్నారు.

వ్యవసాయాన్ని మరింత స్థిరంగా, అందుబాటులోకి తీసుకురావడమే తమ అంతిమ లక్ష్యమని అమూల్య స్పష్టీకరించారు. ఈ ప్రాజెక్టును మరింత మెరుగుపరస్తూ, జీపీఎస్ సాయంతో, సౌరశక్తితో పనిచేసేలా, మరిన్ని పంట రకాలు, ప్రాంతీయ వైవిధ్యాలకు మద్దతు ఇవ్వడానికి డేటాసెట్ విస్తరణ చేపట్టాన్నారు.ఈ వ్యవసాయ ఆవిష్కరణతో పాటు, మరొక అధిక ప్రభావ ప్రాజెక్టును కూడా పూర్తిచేసినట్టు అమూల్య వెల్లడించారు. ఈ ప్రాజెక్టు వివిధ ఎలక్ట్రానిక్ సిస్టమ్ లకు అవసరమైన వరుస ఉజ్జాయింపు రిజిస్టర్ (ఎస్ఏఆర్) అనలాగ్-టు-డిజిటల్ కన్వర్టర్ లలో సిగ్నల్ విశ్వసనీయతను మెరుగుపరచడంపై దృష్టి సారించినట్టు అమూల్య తెలిపారు.

ఈ ప్రాజెక్టుకు మార్గదర్శనం చేసిన ఈఈసీఈ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సీహెచ్. ప్రవీణ్ కుమార్, తన బృంద సభ్యులు కె.మణికంఠ, శివ ధనుష్ ముసునూరిలకు ఆమె హృదయపూర్వక కృతజ్జతలు తెలియజేశారు. ఈ ప్రాజెక్టులు కృత్రిమ మేధస్సు, ఎంబెడెడ్ సిస్టమ్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ వంటి వాటిపై అవగాహనను మరింతగా పెంచుకోవడానికి తమకు అవకాశం కల్పించాయన్నారు.అమూల్య, ఆమె బృందం సాధించిన విజయాలను గీతం నాయకత్వం- హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ ప్రొఫెసర్ వీ.ఆర్. శాస్త్రి, అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్. సీతారామయ్య, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవి తదితరులు విద్యార్థుల ఆవిష్కరణ, శ్రేష్ఠతలను ప్రశంసించారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago